ETV Bharat / city

ఆర్థిక సంక్షోభం పేరిట పాలకవర్గాల శ్రమదోపిడి: ప్రొ.నాగేశ్వర్​

హిమాయత్​నగర్​లోని ఎస్​ఎన్​రెడ్డి భవన్‌లో "సామాజిక న్యాయం కోసం దోపిడి - సమాజాల అంతం కోసం పోరాటం " అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఆచార్య నాగేశ్వర్​ నవీన సమాజ నిర్మాణం కోసం కార్మికవర్గం సమరశీల పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. విపత్తు పెట్టుబడిదారి విధానం ప్రపంచాన్ని ఆవరించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

author img

By

Published : Oct 3, 2020, 6:47 PM IST

professor Nageshwar fire on financial crisis and Labour exploitation in india
ఆర్థిక సంక్షోభం పేరిట పాలకవర్గాల శ్రమదోపిడి: ప్రొ. నాగేశ్వర్​

ఆదిపత్యవాదం సామాజిక న్యాయానికి అడ్డంకిగా మారిందని ఆచార్య కె.నాగేశ్వర్ అన్నారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూ.ఎఫ్.టి.యు) 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏఐటీయూసీ, సీఐటీయూ , ఏఐయూటియూసి ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని ఎస్​ఎన్​రెడ్డి భవన్‌లో "సామాజిక న్యాయం కోసం దోపిడి - సమాజాల అంతం కోసం పోరాటం" అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

సామాజిక సమన్యాయం, అంతరాలులేని నవీన సమాజ నిర్మాణం కోసం కార్మికవర్గం సమరశీల పోరాటాలు సాగించాలని నాగేశ్వర్ పిలుపునిచ్చారు. పెట్టుబడికి శ్రమకు మధ్య పోరాటం జరుగుతుందని.. పెట్టుబడే పైచేయి సాధించబోతుందని... దీన్ని ప్రతిఘటించేందుకు కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. నూతన పారిశ్రామిక విధానం వల్ల కార్మికవర్గం హక్కులు హరించబడుతున్నాయన్నారు. కార్మికులకు సామాజిక భద్రత లేకుండా చేస్తుందని విమర్శించారు. ఆర్థిక సంక్షోభాన్ని, శ్రమదోపిడిని అధిగమించడానికి విజయవంతమైన పోరాటాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు.

విపత్తు పెట్టుబడిదారి విధానం ప్రపంచాన్ని ఆవరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ద్వారానే ఆర్థిక సంక్షోభాన్ని నివారిస్తామని.. ప్రజల చేతుల్లో డబ్బు పెడితేనే కొనుగోలుశక్తి పెరుగుతుందని వెల్లడించారు. విపత్తులను ఆలోచనలుగా మార్చుకొని కార్మికవర్గం పోరుసాగించాలని.. మతోన్మాద శక్తుల, మితవాదశక్తుల కుట్రను ప్రతిఘటించాలని కోరారు. ఆర్థిక సంక్షోభం పేరిట పాలకవర్గాలు శ్రమదోపిడి చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి: ధరణి ఫోర్టల్​లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే

ఆదిపత్యవాదం సామాజిక న్యాయానికి అడ్డంకిగా మారిందని ఆచార్య కె.నాగేశ్వర్ అన్నారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూ.ఎఫ్.టి.యు) 75 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏఐటీయూసీ, సీఐటీయూ , ఏఐయూటియూసి ఆధ్వర్యంలో హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని ఎస్​ఎన్​రెడ్డి భవన్‌లో "సామాజిక న్యాయం కోసం దోపిడి - సమాజాల అంతం కోసం పోరాటం" అనే అంశంపై సదస్సు నిర్వహించారు.

సామాజిక సమన్యాయం, అంతరాలులేని నవీన సమాజ నిర్మాణం కోసం కార్మికవర్గం సమరశీల పోరాటాలు సాగించాలని నాగేశ్వర్ పిలుపునిచ్చారు. పెట్టుబడికి శ్రమకు మధ్య పోరాటం జరుగుతుందని.. పెట్టుబడే పైచేయి సాధించబోతుందని... దీన్ని ప్రతిఘటించేందుకు కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. నూతన పారిశ్రామిక విధానం వల్ల కార్మికవర్గం హక్కులు హరించబడుతున్నాయన్నారు. కార్మికులకు సామాజిక భద్రత లేకుండా చేస్తుందని విమర్శించారు. ఆర్థిక సంక్షోభాన్ని, శ్రమదోపిడిని అధిగమించడానికి విజయవంతమైన పోరాటాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు.

విపత్తు పెట్టుబడిదారి విధానం ప్రపంచాన్ని ఆవరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ద్వారానే ఆర్థిక సంక్షోభాన్ని నివారిస్తామని.. ప్రజల చేతుల్లో డబ్బు పెడితేనే కొనుగోలుశక్తి పెరుగుతుందని వెల్లడించారు. విపత్తులను ఆలోచనలుగా మార్చుకొని కార్మికవర్గం పోరుసాగించాలని.. మతోన్మాద శక్తుల, మితవాదశక్తుల కుట్రను ప్రతిఘటించాలని కోరారు. ఆర్థిక సంక్షోభం పేరిట పాలకవర్గాలు శ్రమదోపిడి చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి: ధరణి ఫోర్టల్​లో ఆస్తుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.