ETV Bharat / city

నేడు పాలిసెట్​.. కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే - నేడు పాలిసెట్

లాక్​డౌన్​తో వాయిదా పడిన పాలిసెట్ పరీక్ష... నేడు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 285 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని బోర్డు తెలిపింది. విద్యార్థులు వ్యక్తిగత శానిటైజర్లు, మాస్కులు తెచ్చుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

polycet conduct with covid preventions in telangana
నేడు పాలిసెట్​.. కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే
author img

By

Published : Sep 2, 2020, 5:18 AM IST

Updated : Sep 2, 2020, 7:09 AM IST

పాలిటెక్నిక్, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు పాలిసెట్ జరగనుంది. కరోనా పరిస్థితులతో గతంలో వాయిదా పడిన పరీక్షను ఇవాళ ప్రత్యేక జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఎస్​బీటీఈటీ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 73 వేల 918 మంది హాజరు కానున్నారు. ఇందుకోసం 285 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష జరగనుంది. పది గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు బోర్డు కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత శానిటైజర్లు, మాస్కులు తెచ్చుకోవాలని, భౌతికదూరం వంటి... కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

పాలిటెక్నిక్, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు పాలిసెట్ జరగనుంది. కరోనా పరిస్థితులతో గతంలో వాయిదా పడిన పరీక్షను ఇవాళ ప్రత్యేక జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఎస్​బీటీఈటీ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 73 వేల 918 మంది హాజరు కానున్నారు. ఇందుకోసం 285 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష జరగనుంది. పది గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు బోర్డు కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత శానిటైజర్లు, మాస్కులు తెచ్చుకోవాలని, భౌతికదూరం వంటి... కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇదీచూడండి.. ' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'

Last Updated : Sep 2, 2020, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.