ETV Bharat / city

నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

సికింద్రాబాద్​ మహంకాళి పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఎంజే రోడ్డులో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 24 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jun 20, 2020, 10:55 PM IST

Police Arrest Fake Seeds Vendor In Secundrabad
నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

సికింద్రాబాద్​ మహంకాళి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉత్తర మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న అశోక్​ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఎంజే రోడ్డులోని విజేత ఎంటర్​ప్రైజెస్​లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు జరిపిన సోదాల్లో రూ.24 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. నిందితుడు గుజరాత్​ నుంచి ఆ విత్తనాలు అనుమతి లేకుండా తీసుకొచ్చి రాష్ట్రంలో విక్రయిస్తున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి.. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

సికింద్రాబాద్​ మహంకాళి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఉత్తర మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న అశోక్​ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఎంజే రోడ్డులోని విజేత ఎంటర్​ప్రైజెస్​లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు జరిపిన సోదాల్లో రూ.24 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. నిందితుడు గుజరాత్​ నుంచి ఆ విత్తనాలు అనుమతి లేకుండా తీసుకొచ్చి రాష్ట్రంలో విక్రయిస్తున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి.. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​ గన్​మెన్​కు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.