ETV Bharat / city

'తెలంగాణ అభివృద్ధే మా ప్రాధాన్యత.. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది..'

author img

By

Published : Jul 3, 2022, 8:09 PM IST

Updated : Jul 3, 2022, 8:32 PM IST

Modi Speech in BJP Vijay Sankalpa Sabha: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు భాజపాపై ఎన్నో రెట్లు నమ్మకం పెరిగిందన్నారు.

PM Modi Speech in BJP Vijay Sankalpa Sabha
PM Modi Speech in BJP Vijay Sankalpa Sabha
'తెలంగాణ అభివృద్ధే మా ప్రాధాన్యత.. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది..'

Modi Speech in BJP Vijay Sankalpa Sabha: ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుందని మోదీ దీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణలో సత్వర అభివృద్ధి జరుగుతుందన్నారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే ప్రతి పట్టణం, పల్లె అభివృద్ధి చెందుతాయని వివరించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్న మోదీ.. రాష్ట్ర అభివృద్ధే భాజపా ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. భాజపాపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోందని.. డబుల్ ఇంజిన్ సర్కారు కోసం రాష్ట్ర ప్రజలు పట్టాలు వేస్తున్నారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి అందిస్తోన్న సహకారాన్ని వివరించిన మోదీ.. పలు వరాలు సైతం కురిపించారు.

తెలుగులో ప్రసంగం..: సికింద్రాబాద్​లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాలతో భాజపా నేతలు స్వాగతం పలికారు. లక్షల మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వేదికపైకి వచ్చిన నరేంద్ర మోదీ.. అందరికి అభివాదం చేశారు. మోదీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ శాలువా కప్పి.. సన్మానించారు. అనంతరం.. సభలో ప్రసంగించిన మోదీ.. మొదట్లో తెలుగులో మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. "సోదర సోదరీమణులకు నమస్కారాలు. ఎంతోదూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు. తెలంగాణ నేలతల్లికి వందనం సమర్పిస్తున్నా. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.." అంటూ.. మోదీ తెలుగులో ప్రసంగించారు. అందుకు.. కార్యకర్తలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. మోదీ.. నినాదాలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు.

తెలంగాణ పవిత్ర భూమి..: సభా ప్రాంగణాన్ని చూసి ఉప్పొంగిపోయిన మోదీ.. ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మొత్తం మైదానంలో కూర్చున్నట్లు ఉందన్నారు. తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కారించారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పురిటిగడ్డ అని కొనియాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ.. అందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ పవిత్ర భూమి అని.. దేశప్రజలకు యాదాద్రి, జోగులాంబ, భద్రకాళి ఆశీస్సులు ఉంటాయన్నారు. హైదరాబాద్‌ నగరం అన్నిరంగాల వారికి అండగా నిలుస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఆదరించారని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు భాజపాపై నమ్మకం ఎన్నోరెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత..

"ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారింది. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. భాగ్యనగరంలో అనేక పైవంతెనలు నిర్మించాం. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండురెట్లు పెరిగాయి. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చా. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చాం. తెలుగులో సాంకేతిక, వైద్యవిద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారం. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో 5 భారీ ప్రాజెక్టులు చేపట్టాం. తెలంగాణలో ప్రతి పల్లెకూ రోడ్లు అనుసంధానం చేస్తున్నాం. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తాం. తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత. భాజపాపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

దళితులు, ఆదివాసీలు, పేదల ఆకాంక్షలను భాజపా నెరవేర్చిందని మోదీ తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నచోట వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. 8 ఏళ్లుగా దేశప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచామన్నారు. తమ పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచామన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు.

"మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగింది. మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగింది. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చాం. తెలుగులో సాంకేతిక, వైద్యవిద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయి." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇవీ చూడండి:

'తెలంగాణ అభివృద్ధే మా ప్రాధాన్యత.. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది..'

Modi Speech in BJP Vijay Sankalpa Sabha: ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుందని మోదీ దీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణలో సత్వర అభివృద్ధి జరుగుతుందన్నారు. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే ప్రతి పట్టణం, పల్లె అభివృద్ధి చెందుతాయని వివరించారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్న మోదీ.. రాష్ట్ర అభివృద్ధే భాజపా ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. భాజపాపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోందని.. డబుల్ ఇంజిన్ సర్కారు కోసం రాష్ట్ర ప్రజలు పట్టాలు వేస్తున్నారని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి అందిస్తోన్న సహకారాన్ని వివరించిన మోదీ.. పలు వరాలు సైతం కురిపించారు.

తెలుగులో ప్రసంగం..: సికింద్రాబాద్​లో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాలతో భాజపా నేతలు స్వాగతం పలికారు. లక్షల మంది కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వేదికపైకి వచ్చిన నరేంద్ర మోదీ.. అందరికి అభివాదం చేశారు. మోదీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ శాలువా కప్పి.. సన్మానించారు. అనంతరం.. సభలో ప్రసంగించిన మోదీ.. మొదట్లో తెలుగులో మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. "సోదర సోదరీమణులకు నమస్కారాలు. ఎంతోదూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు. తెలంగాణ నేలతల్లికి వందనం సమర్పిస్తున్నా. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.." అంటూ.. మోదీ తెలుగులో ప్రసంగించారు. అందుకు.. కార్యకర్తలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. మోదీ.. నినాదాలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు.

తెలంగాణ పవిత్ర భూమి..: సభా ప్రాంగణాన్ని చూసి ఉప్పొంగిపోయిన మోదీ.. ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మొత్తం మైదానంలో కూర్చున్నట్లు ఉందన్నారు. తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కారించారు. ప్రాచీన సంస్కృతి, పరాక్రమానికి తెలంగాణ పురిటిగడ్డ అని కొనియాడారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళ.. అందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ పవిత్ర భూమి అని.. దేశప్రజలకు యాదాద్రి, జోగులాంబ, భద్రకాళి ఆశీస్సులు ఉంటాయన్నారు. హైదరాబాద్‌ నగరం అన్నిరంగాల వారికి అండగా నిలుస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఆదరించారని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు భాజపాపై నమ్మకం ఎన్నోరెట్లు పెరిగిందని స్పష్టం చేశారు. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. మంత్రంతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత..

"ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారింది. తెలంగాణ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్‌ చుట్టూ ప్రాంతీయ రింగ్‌రోడ్డు కూడా నిర్మిస్తున్నాం. భాగ్యనగరంలో అనేక పైవంతెనలు నిర్మించాం. మా పాలనలో తెలంగాణలో హైవేలు రెండురెట్లు పెరిగాయి. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి తీరుతుంది. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ వస్తేనే తెలంగాణ వేగంగా అభివృద్ధి. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చా. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చాం. తెలుగులో సాంకేతిక, వైద్యవిద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారం. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో 5 భారీ ప్రాజెక్టులు చేపట్టాం. తెలంగాణలో ప్రతి పల్లెకూ రోడ్లు అనుసంధానం చేస్తున్నాం. తెలంగాణలో మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తాం. తెలంగాణ అభివృద్ధే మా పార్టీ ప్రాధాన్యత. భాజపాపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పెరుగుతోంది." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

దళితులు, ఆదివాసీలు, పేదల ఆకాంక్షలను భాజపా నెరవేర్చిందని మోదీ తెలిపారు. కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి అండగా నిలిచామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నచోట వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. 8 ఏళ్లుగా దేశప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచామన్నారు. తమ పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు వివరించారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచామన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందన్నారు.

"మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగింది. మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగింది. కొత్త జాతీయ విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చాం. తెలుగులో సాంకేతిక, వైద్యవిద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయి." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇవీ చూడండి:

Last Updated : Jul 3, 2022, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.