వ్యాయామ ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ పీఈసెట్ దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 7,368 మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ నిర్వహిస్తున్నారు.
కరోనా పాజిటివ్ ఉన్న అభ్యర్థులకు పరీక్షలకు అనుమతి లేదని పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. కరోనాతో బాధపడుతున్న వారికి మరోసారి నిర్వహించే ఆలోచన లేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్లు సస్పెన్షన్