రాష్ట్రంలో ఉన్నత విద్యావ్యవస్థ నిర్వీర్యం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కోరారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించాలని డిమాండ్ చేశారు.
తెరాస అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిని నియమించలేదని ఆరోపించారు. వీసీల నియామకంపై గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకోవడం శుభపరిణామన్నారు. వీలైనంత తొందరగా వైస్ ఛాన్స్లర్లను నియమించాలని గవర్నర్ సూచించడం.. రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. గవర్నర్ జోక్యాన్ని సానుకూలంగా తీసుకోవాలని.. సర్కార్కు సూచించారు.
ఇవీచూడండి: 'వర్సిటీలకు పూర్తిస్థాయి వీసీలను నియమించండి'