ETV Bharat / city

క్రీస్తు ఆశయాలు ప్రపంచానికే ఆదర్శం: ఉత్తమ్

author img

By

Published : Dec 23, 2020, 9:57 PM IST

గాంధీభవన్​లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్సవాలకు హాజరై... రాష్ట్ర ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సర్వమత సహనాన్ని ఆశిస్తోందని వ్యాఖ్యానించారు.

pcc president uthamkumar reddy attend to christmas celebrations in gandhi bhavan
ఏసుక్రీస్తు ఆశయాలు ప్రపంచానికి ఆదర్శం: ఉత్తమ్

సర్వమత సహనాన్ని కాంగ్రెస్‌ ఆశిస్తోందని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఏసు భక్తి గీతాలతో, భక్తి శ్రద్ధలతో వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

క్రీస్తు బోధనలు ప్రపంచానికి మార్గదర్శకమని, ప్రపంచ శాంతిని కోరుకున్న ఏసుక్రీస్తు ఆశయాలు అందరికీ ఆదర్శమని ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాతం లౌకికవాదమని, అందరూ కలిసి మెలిసి ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్​, తదితరులు పాల్గొన్నారు.

సర్వమత సహనాన్ని కాంగ్రెస్‌ ఆశిస్తోందని... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఏసు భక్తి గీతాలతో, భక్తి శ్రద్ధలతో వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

క్రీస్తు బోధనలు ప్రపంచానికి మార్గదర్శకమని, ప్రపంచ శాంతిని కోరుకున్న ఏసుక్రీస్తు ఆశయాలు అందరికీ ఆదర్శమని ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాతం లౌకికవాదమని, అందరూ కలిసి మెలిసి ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్​, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నాపై ప్రజలకు అభిమానం ఇంకా ఉంది: జానా రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.