ETV Bharat / city

తెలంగాణలో మరొకరికి కరోనా... 155కు చేరిన కేసులు

author img

By

Published : Apr 3, 2020, 1:47 PM IST

Updated : Apr 3, 2020, 2:56 PM IST

corona
నాగర్‌కర్నూల్ జిల్లాలో మరొకరికి కరోనా.. మొత్తం 155 చేరిన కేసులు

13:45 April 03

తెలంగాణలో మరొకరికి కరోనా... 155కు చేరిన కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణనూ కలవర పెడుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. కరోనా బాధితుడు ఇటీవల దిల్లీ మర్కజ్ వెళ్లొచ్చినట్టు వివరించారు. అతనితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  

నిన్న ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసుతో కలుకుని మొత్తం కరోనా బాధితుల సంఖ్య 155కు పెరిగింది. ఇప్పటివరకూ 17 మంది డిశ్చార్జి అవ్వగా.. 9 మంది మరణించారు. నిజాముద్దీన్​ మర్కజ్​ ఘటన తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 

 ఇవీచూడండి: ఏపీలో మరో 12 మందికి కరోనా... 161కి చేరిన కేసులు

13:45 April 03

తెలంగాణలో మరొకరికి కరోనా... 155కు చేరిన కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణనూ కలవర పెడుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టు కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. కరోనా బాధితుడు ఇటీవల దిల్లీ మర్కజ్ వెళ్లొచ్చినట్టు వివరించారు. అతనితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  

నిన్న ఒక్కరోజే 27 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసుతో కలుకుని మొత్తం కరోనా బాధితుల సంఖ్య 155కు పెరిగింది. ఇప్పటివరకూ 17 మంది డిశ్చార్జి అవ్వగా.. 9 మంది మరణించారు. నిజాముద్దీన్​ మర్కజ్​ ఘటన తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 

 ఇవీచూడండి: ఏపీలో మరో 12 మందికి కరోనా... 161కి చేరిన కేసులు

Last Updated : Apr 3, 2020, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.