ETV Bharat / city

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సమావేశం అయ్యారు.

author img

By

Published : Jun 27, 2020, 11:18 AM IST

Updated : Jun 27, 2020, 12:06 PM IST

mp-raghuramakrishna-raju-meeting-with-defence-minister-rajnath-singh
రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు సమావేశం అయ్యారు. షోకాజ్ నోటీసు, అనర్హత వేటు వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తనకు భద్రత కల్పించాలంటూ స్పీకర్​ ఓం బిర్లాకు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు...శుక్రవారం నేరుగా స్పీకర్​ను కలిశారు. అదే విధంగా వైకాపా జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డితో భేటీ

mp-raghuramakrishna-raju-meeting-with-defence-minister-rajnath-singh
హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డితో ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ పర్యటనలో ఉన్న రఘురామకృష్ణరాజు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలిశారు. తన భద్రత విషయంపై కిషన్‌రెడ్డితో చర్చించారు. స్పీకర్ కార్యాలయం హోంశాఖకు పంపిందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విషయాలు తెలుసుకుని... పరిశీలిస్తానని కేంద్రమంత్రి చెప్పారు.

హోంశాఖ కార్యదర్శితో భేటీ

హోంశాఖ కేంద్రమంత్రులను కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు.. మధ్యాహ్నం 3గం.ల తర్వాత హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలవనున్నారు. తన భద్రత కు సంబంధించిన విషయంపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి: గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో 'హాస్యబ్రహ్మ'

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఎంపీ రఘురామకృష్ణరాజు సమావేశం అయ్యారు. షోకాజ్ నోటీసు, అనర్హత వేటు వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే తనకు భద్రత కల్పించాలంటూ స్పీకర్​ ఓం బిర్లాకు లేఖ రాసిన రఘురామకృష్ణరాజు...శుక్రవారం నేరుగా స్పీకర్​ను కలిశారు. అదే విధంగా వైకాపా జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంబంధించి కేంద్రం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డితో భేటీ

mp-raghuramakrishna-raju-meeting-with-defence-minister-rajnath-singh
హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డితో ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ పర్యటనలో ఉన్న రఘురామకృష్ణరాజు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలిశారు. తన భద్రత విషయంపై కిషన్‌రెడ్డితో చర్చించారు. స్పీకర్ కార్యాలయం హోంశాఖకు పంపిందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విషయాలు తెలుసుకుని... పరిశీలిస్తానని కేంద్రమంత్రి చెప్పారు.

హోంశాఖ కార్యదర్శితో భేటీ

హోంశాఖ కేంద్రమంత్రులను కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు.. మధ్యాహ్నం 3గం.ల తర్వాత హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలవనున్నారు. తన భద్రత కు సంబంధించిన విషయంపై చర్చించనున్నారు.

ఇదీ చదవండి: గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో 'హాస్యబ్రహ్మ'

Last Updated : Jun 27, 2020, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.