కరోనాపై ఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ప్రభుత్వం దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించాలన్నారు.
పథకాలన్నింటికి జగన్ పేరు పెట్టుకోవడం అలవాటైందని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలోనూ జగనన్న కరోనా కేర్ లేదా మరేదైనా పేరు పెట్టుకోండని సూచించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.
ఇవీచూడండి: కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కిషన్రెడ్డి