ETV Bharat / city

'అదానీకి రూ.12వేల కోట్లు మాఫీ చేశారు.. రైతులకు రూ.1500కోట్లు ఇవ్వలేరా?'

author img

By

Published : Apr 12, 2022, 7:38 PM IST

Updated : Apr 12, 2022, 10:19 PM IST

KCR Fire on Modi: కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో ఉండడం భారత రైతుల దురదృష్టమన్నారు. ఆహార భద్రత బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని ఆక్షేపించారు. వేల కోట్లు ఎగ్గొట్టిన ఘరానా దొంగలను కాపాడడమే మోదీ సర్కార్ సాధించిన ఘనత అని మండిపడ్డారు. కేంద్ర పెద్దల పాపాలపుట్టను బయటపెడతానని తెలిపారు. దేశాన్ని చైతన్యపరచడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పారు.

kcr
kcr

KCR Fire on Modi: దేశంలో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ పదేపదే బలంగా చెప్తూ వస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్... వ్యవసాయం అంశంగా మరోమారు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉండటం భారత రైతుల దురదృష్టమన్న ఆయన... దేశంలో వ్యవసాయరంగాన్ని బలహీన పర్చే అంతర్గత కుట్రకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణ రైతులు, రాష్ట్రాన్ని అవమాననపరుస్తూ మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్​కు ఎంత గర్వం, ఎంత అహంకారమని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం సాధించలేని లక్ష్యాలను తెలంగాణ సాధిస్తోంటే జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.

ఆహార భద్రత చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. దిల్లీ వేదికగా భారత ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసి దోషిగా నిలబెట్టినట్లు తెలిపారు. ఆర్థిక నేరగాళ్లను అరెస్టు చేయకుండా కాపాడుతున్నారని... మాల్యా, నీరవ్‌ మోదీని అరెస్టు చేసేందుకు వెళ్లిన అధికారులను వెనక్కి రప్పించారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. త్వరలోనే దేశం ముందు వారి బండారాన్ని బయటపెడతామని ప్రకటించారు. రైతులకు మాఫీ చేయద్దన్న భాజపా నేతలు కార్పొరేట్‌ సంస్థలకు రూ.10.50లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని అన్నారు. ఒక్క అదానీ గ్రూపునకే రూ.12వేల కోట్లు మాఫీ చేశారని చెప్పారు. రైతులకు రూ.1500కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వానికి చేతులురావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బలమైన దేశం, బలహీన రాష్ట్రాలు అన్నది భాజపా, ఆరెస్సెస్ విధానమని కేసీఆర్ అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పాలన చేతకాక... అనాలోచిత నిర్ణయాలతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. దేశంలో జీడీపీ తగ్గిందని, నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు.

కేంద్ర సర్కార్​కు అధికార నిషా తలకెక్కిందని, మత గజ్జికి సంబంధించి చిల్లర పద్ధతుల్లో విద్వేషాలను రెచ్చగొడుతోందని సీఎం ఆరోపించారు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డ కేసీఆర్... మతవిద్వేషాలతో దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఉన్మాదుల చేతిలో పడి దేశం వందేళ్లు వెనక్కి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు కుటిల యత్నాలను అర్థం చేసుకొని, తిప్పికొట్టాలని కేసీఆర్ కోరారు. హిట్లర్లు, ముస్సోలినీలే పోయారు... వీరెంతని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే యుద్ధం, సర్జికల్‌ దాడులు అంటూ ప్రజలను భాజపా రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఓట్లు కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో రాళ్ల దాడులు జరిగాయని చెప్పారు.

దేశాన్ని చైతన్యపరచడంలో తాను ప్రముఖ పాత్ర పోషిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహాసంగ్రామం జరుగుతుందని చెప్పారు. దేశ రైతులకు దిక్కూ, దివానం లేరని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు కనీస మద్దతు ధర కోసం రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ సమీకృత వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే హైదరాబాద్ వేదికగా ఆర్థికవేత్తలు, రైతుసంఘాల ప్రతినిధులు సమావేశమై విధాన రూపకల్పన చేస్తామని తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే... తోసివేసి వచ్చే కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

ఇదీ చదవండి : యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: సీఎం

KCR Fire on Modi: దేశంలో ప్రబలమైన మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ పదేపదే బలంగా చెప్తూ వస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్... వ్యవసాయం అంశంగా మరోమారు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉండటం భారత రైతుల దురదృష్టమన్న ఆయన... దేశంలో వ్యవసాయరంగాన్ని బలహీన పర్చే అంతర్గత కుట్రకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెలంగాణ రైతులు, రాష్ట్రాన్ని అవమాననపరుస్తూ మాట్లాడిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్​కు ఎంత గర్వం, ఎంత అహంకారమని కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం సాధించలేని లక్ష్యాలను తెలంగాణ సాధిస్తోంటే జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.

ఆహార భద్రత చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. దిల్లీ వేదికగా భారత ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసి దోషిగా నిలబెట్టినట్లు తెలిపారు. ఆర్థిక నేరగాళ్లను అరెస్టు చేయకుండా కాపాడుతున్నారని... మాల్యా, నీరవ్‌ మోదీని అరెస్టు చేసేందుకు వెళ్లిన అధికారులను వెనక్కి రప్పించారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. త్వరలోనే దేశం ముందు వారి బండారాన్ని బయటపెడతామని ప్రకటించారు. రైతులకు మాఫీ చేయద్దన్న భాజపా నేతలు కార్పొరేట్‌ సంస్థలకు రూ.10.50లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని అన్నారు. ఒక్క అదానీ గ్రూపునకే రూ.12వేల కోట్లు మాఫీ చేశారని చెప్పారు. రైతులకు రూ.1500కోట్లు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వానికి చేతులురావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బలమైన దేశం, బలహీన రాష్ట్రాలు అన్నది భాజపా, ఆరెస్సెస్ విధానమని కేసీఆర్ అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పాలన చేతకాక... అనాలోచిత నిర్ణయాలతో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. దేశంలో జీడీపీ తగ్గిందని, నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు.

కేంద్ర సర్కార్​కు అధికార నిషా తలకెక్కిందని, మత గజ్జికి సంబంధించి చిల్లర పద్ధతుల్లో విద్వేషాలను రెచ్చగొడుతోందని సీఎం ఆరోపించారు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డ కేసీఆర్... మతవిద్వేషాలతో దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఉన్మాదుల చేతిలో పడి దేశం వందేళ్లు వెనక్కి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు కుటిల యత్నాలను అర్థం చేసుకొని, తిప్పికొట్టాలని కేసీఆర్ కోరారు. హిట్లర్లు, ముస్సోలినీలే పోయారు... వీరెంతని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే యుద్ధం, సర్జికల్‌ దాడులు అంటూ ప్రజలను భాజపా రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఓట్లు కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని అన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో రాళ్ల దాడులు జరిగాయని చెప్పారు.

దేశాన్ని చైతన్యపరచడంలో తాను ప్రముఖ పాత్ర పోషిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహాసంగ్రామం జరుగుతుందని చెప్పారు. దేశ రైతులకు దిక్కూ, దివానం లేరని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు కనీస మద్దతు ధర కోసం రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ సమీకృత వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే హైదరాబాద్ వేదికగా ఆర్థికవేత్తలు, రైతుసంఘాల ప్రతినిధులు సమావేశమై విధాన రూపకల్పన చేస్తామని తెలిపారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే... తోసివేసి వచ్చే కొత్త ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

ఇదీ చదవండి : యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది: సీఎం

Last Updated : Apr 12, 2022, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.