రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను ఎంతో వైభవంగా జరుపుకోనేలా రాష్ట్రావతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట డివిజన్ పాటిగడ్డ చర్చిలో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.
బోనాలు, రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ వంటి ఉత్సవాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పల తరుణి, మహేశ్వరి, డీసీ ముకుంద రెడ్డి, చర్చి ఫాస్టర్ కిరణ్, తెరాస నాయకులు నరేందర్, శేఖర్, శ్రీనివాస్ గౌడ్, అఖిల్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'దేశానికి దిక్సూచి చూపించిన మహానేత పీవీ'