ETV Bharat / city

PEDDI REDDY: అమర్​రాజా బ్యాటరీస్​పై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Aug 5, 2021, 5:10 PM IST

ఏపీ నుంచి అమర్​ రాజా బ్యాటరీస్ సంస్థ వెళ్లిపోవాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని ఆ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. అవసరమయితే అక్కడకు సమీపంలోనే ఆ సంస్థ కొనుగోలు చేసిన 4 వేల ఎకరాల్లో పరిశ్రమను స్థాపించుకోవచ్చని సూచించారు. ఏపీకి కొత్త పరిశ్రమలు తీసుకురావడమే కాక.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు.

ap pamchayati raj minister peddi reddy
ap pamchayati raj minister peddi reddy

ఏపీకి కొత్త పరిశ్రమలు తీసుకురావడమే కాక.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి అమర్​ రాజా బ్యాటరీస్ సంస్థ వెళ్లిపోవాలని తమ ప్రభుత్వం కోరుకోవటం లేదని చెప్పారు.

అవసరమయితే అక్కడకు సమీపంలోనే వారు కొనుగోలు చేసిన 4 వేల ఎకరాల్లో పరిశ్రమను స్థాపించుకోవచ్చని సలహా ఇచ్చారు. ప్రతీ పదేళ్లకు బ్యాటరీ తయారీ కంపెనీలు తమ యూనిట్‌లను రీ-లొకేట్ చేయాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. లాభాల కోసమే అమర్​ రాజా కంపెనీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు.

ఏపీకి కొత్త పరిశ్రమలు తీసుకురావడమే కాక.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి అమర్​ రాజా బ్యాటరీస్ సంస్థ వెళ్లిపోవాలని తమ ప్రభుత్వం కోరుకోవటం లేదని చెప్పారు.

అవసరమయితే అక్కడకు సమీపంలోనే వారు కొనుగోలు చేసిన 4 వేల ఎకరాల్లో పరిశ్రమను స్థాపించుకోవచ్చని సలహా ఇచ్చారు. ప్రతీ పదేళ్లకు బ్యాటరీ తయారీ కంపెనీలు తమ యూనిట్‌లను రీ-లొకేట్ చేయాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. లాభాల కోసమే అమర్​ రాజా కంపెనీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు.

ఇవీచూడండి: Devineni Uma: రాజమహేంద్రవరం జైలు నుంచి దేవినేని ఉమ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.