ETV Bharat / city

ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందుల కొరతపై మంత్రి ఆగ్రహం - minister mallareddy updates on esi

ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో సరైన మోతాదులో మందులు దొరకకపోవడంపై మంత్రి మల్లా రెడ్డి.. ఈఎస్ఐ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్ క్యాంపస్​లో ఈఎస్ఐ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

minister mallareddy fires on esi employees due to shortage of medicines
ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందుల కొరతపై మంత్రి ఆగ్రహం
author img

By

Published : Oct 10, 2020, 8:45 AM IST

రోగులకు వీఐపీల తరహాలో చికిత్స అందించిన నాడే తీసుకుంటున్న జీతానికి న్యాయం చేసిన వారవుతారని ఈఎస్ఐ అధికారులను ఉద్దేశించి మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతినెలా కోట్ల రూపాయల ఇండెంట్లు పంపుతున్నా... ఇప్పటికీ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈఎస్ఐ అధికారులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్ క్యాంపస్​లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇకపై ప్రతినెలా రోగులకు అందించిన మందుల వివరాలను ఆన్​లైన్ లో ఉంచాలని ఆదేశించారు. అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈఎస్ఐలో సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'మొక్కజోన్న రైతులు ఆందోళన పడకండి... ప్రతీ గింజ కొంటాం'

రోగులకు వీఐపీల తరహాలో చికిత్స అందించిన నాడే తీసుకుంటున్న జీతానికి న్యాయం చేసిన వారవుతారని ఈఎస్ఐ అధికారులను ఉద్దేశించి మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతినెలా కోట్ల రూపాయల ఇండెంట్లు పంపుతున్నా... ఇప్పటికీ ఈఎస్ఐ డిస్పెన్సరీల్లో మందుల కొరత ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈఎస్ఐ అధికారులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్ క్యాంపస్​లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇకపై ప్రతినెలా రోగులకు అందించిన మందుల వివరాలను ఆన్​లైన్ లో ఉంచాలని ఆదేశించారు. అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఈఎస్ఐలో సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'మొక్కజోన్న రైతులు ఆందోళన పడకండి... ప్రతీ గింజ కొంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.