ETV Bharat / city

క్షేత్రస్థాయిలో కేటీఆర్​ పర్యటన.. సహాయక చర్యలపై అక్కడికక్కడే ఆదేశాలు - ktr interacted with people in hyderabad

వర్ష ప్రభావిత కాలనీల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. బుధవారం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జీహెచ్ఎంసీ షెల్టర్ హోంలకు వెళ్లాలని సూచించారు. అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.

minister ktr visited rain effect areas in hyderabad
క్షేత్రస్థాయిలో కేటీఆర్​ పర్యటన.. సహాయక చర్యలపై అక్కడికక్కడే ఆదేశాలు
author img

By

Published : Oct 15, 2020, 5:45 AM IST

భారీ వర్షాలు హైదరాబాద్​ను ముంచెత్తిన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. బుధవారం ఉదయం.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి... వర్షాలు కొంత తెరిపినివ్వడంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. నగరానికి చెందిన శాసన సభ్యులు, కార్పొరేటర్లు, ఇతర ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలవాలని కేటీఆర్ సూచించారు.

ప్రభుత్వం అండగా ఉంటుందని...

సచివాలయంలో సీఎస్ సోమేశ్​ కుమార్, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... హైదరాబాద్​లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం మంత్రి మహమూద్​ అలీ, సీఎస్ సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్​ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని భైరామల్​గూడ చెరువును పరిశీలించిన కేటీఆర్... పరిసర కాలనీల ప్రజలను పరామర్శించారు. చెరువు ఉప్పొంగి తమ ఇళ్లలోకి నీరు వచ్చిందని కాలనీ వాసులు కేటీఆర్​ దృష్టికి తీసుకువచ్చారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లకు సూచించారు.

మరో రెండు రోజులు వర్షాలున్నాయ్​..

ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చెరువు నిండి హబ్సీగూడాలోని వీధులు, ఇళ్లలోకి చేరింది. అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు.. కేటీఆర్ ఆ ప్రాంతంలో పర్యటించారు. మలక్ పేటలోని అంజపుర, తీగలగూడా, ముసరంబాగ్, మూసానగర్, శంకర్ నగర్ కాలనీలను కేటీఆర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. తక్షణ సాయంగా వారందరికీ అవసరమైన ఆహారం, దుప్పట్లు, వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా జీహెచ్ఎంసీ షెల్టర్లలో ఉండాలని సూచించారు.

రహదారి మరమ్మతులు చేయండి..

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలతో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాలను కేటీఆర్ పరిశీలించారు. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. పాతబస్తీ నుంచి వచ్చే మురికి నాలాను మంత్రి పరిశీలించారు. ఆరాంఘర్ వద్ద కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించి... వర్షం తగ్గాక రహదారి మరమ్మతులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్​ సరఫరా పునరుద్ధరణకు..

అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పలువురు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని.. పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు కేటీఆర్ సూచించారు. మంత్రి వెంట ఉన్న సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోని సమస్యలపై.. తమ విభాగాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.

ఇవీచూడండి: కుండపోత వర్షంతో అతలాకుతలమైన జంటనగరాలు

భారీ వర్షాలు హైదరాబాద్​ను ముంచెత్తిన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. బుధవారం ఉదయం.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి... వర్షాలు కొంత తెరిపినివ్వడంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. నగరానికి చెందిన శాసన సభ్యులు, కార్పొరేటర్లు, ఇతర ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలవాలని కేటీఆర్ సూచించారు.

ప్రభుత్వం అండగా ఉంటుందని...

సచివాలయంలో సీఎస్ సోమేశ్​ కుమార్, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... హైదరాబాద్​లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం మంత్రి మహమూద్​ అలీ, సీఎస్ సోమేశ్​ కుమార్, డీజీపీ మహేందర్​ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని భైరామల్​గూడ చెరువును పరిశీలించిన కేటీఆర్... పరిసర కాలనీల ప్రజలను పరామర్శించారు. చెరువు ఉప్పొంగి తమ ఇళ్లలోకి నీరు వచ్చిందని కాలనీ వాసులు కేటీఆర్​ దృష్టికి తీసుకువచ్చారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లకు సూచించారు.

మరో రెండు రోజులు వర్షాలున్నాయ్​..

ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చెరువు నిండి హబ్సీగూడాలోని వీధులు, ఇళ్లలోకి చేరింది. అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు.. కేటీఆర్ ఆ ప్రాంతంలో పర్యటించారు. మలక్ పేటలోని అంజపుర, తీగలగూడా, ముసరంబాగ్, మూసానగర్, శంకర్ నగర్ కాలనీలను కేటీఆర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. తక్షణ సాయంగా వారందరికీ అవసరమైన ఆహారం, దుప్పట్లు, వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా జీహెచ్ఎంసీ షెల్టర్లలో ఉండాలని సూచించారు.

రహదారి మరమ్మతులు చేయండి..

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలతో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాలను కేటీఆర్ పరిశీలించారు. సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకున్నారు. పాతబస్తీ నుంచి వచ్చే మురికి నాలాను మంత్రి పరిశీలించారు. ఆరాంఘర్ వద్ద కొట్టుకుపోయిన రహదారిని పరిశీలించి... వర్షం తగ్గాక రహదారి మరమ్మతులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

విద్యుత్​ సరఫరా పునరుద్ధరణకు..

అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పలువురు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని.. పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు కేటీఆర్ సూచించారు. మంత్రి వెంట ఉన్న సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోని సమస్యలపై.. తమ విభాగాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేశారు.

ఇవీచూడండి: కుండపోత వర్షంతో అతలాకుతలమైన జంటనగరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.