ETV Bharat / city

కరోనా నశించాలని.. బెంగాల్ నుంచి తిరుమలకు పాదయాత్ర

author img

By

Published : Dec 31, 2020, 8:45 AM IST

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నశించాలని.. పశ్చిమ బంగా రాష్ట్రానికి చెందిన అద్దంకి విశ్వనాధ్ అనే వ్యక్తి పాదయాత్ర చేపట్టారు. కాలినడకతో తిరుమలకు చేరుకుని స్వామివారి దర్శనం చేసుకోవడానికి సంకల్పంచినట్లు ఆయన తెలిపారు.

కరోనా నశించాలని.. బెంగాల్ నుంచి తిరుమలకు పాదయాత్ర
కరోనా నశించాలని.. బెంగాల్ నుంచి తిరుమలకు పాదయాత్ర

ప్రపంచంలో కరోనా వైరస్ నశించాలంటూ.. పశ్చిమ బంగా రాష్ట్రానికి చెందిన అద్దంకి విశ్వనాధ్ పాదయాత్ర చేపట్టారు. కరోనా వైరస్​ కారణంగా 2020 సంవత్సరంలో చాలామంది మృతిచెందారని, ఈ వైరస్ నశించాలని తిరుమల వరకు పాదయాత్ర చేపట్టాలని సంకల్పించినట్లు విశ్వనాథ్ తెలిపారు. ఈ యాత్ర నవంబర్ 10వ తేదీన పశ్చిమ బంగాలో ప్రారంభించానని.. డిసెంబర్ 30 తేదీకి నెల్లూరుకు చేరుకున్నానట్లు ఆయన తెలిపారు.

పశ్చిమ బంగాలోని కరూపూర్ గ్రామంలో పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు విశ్వనాథ్. ఇంకో వారం రోజుల్లో తిరుమలకు చేరుకుంటానని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు

ప్రపంచంలో కరోనా వైరస్ నశించాలంటూ.. పశ్చిమ బంగా రాష్ట్రానికి చెందిన అద్దంకి విశ్వనాధ్ పాదయాత్ర చేపట్టారు. కరోనా వైరస్​ కారణంగా 2020 సంవత్సరంలో చాలామంది మృతిచెందారని, ఈ వైరస్ నశించాలని తిరుమల వరకు పాదయాత్ర చేపట్టాలని సంకల్పించినట్లు విశ్వనాథ్ తెలిపారు. ఈ యాత్ర నవంబర్ 10వ తేదీన పశ్చిమ బంగాలో ప్రారంభించానని.. డిసెంబర్ 30 తేదీకి నెల్లూరుకు చేరుకున్నానట్లు ఆయన తెలిపారు.

పశ్చిమ బంగాలోని కరూపూర్ గ్రామంలో పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు విశ్వనాథ్. ఇంకో వారం రోజుల్లో తిరుమలకు చేరుకుంటానని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.