ETV Bharat / city

మద్యానికి బానిసయ్యాడు.. శానిటైజర్​ తాగి మరణించాడు - Guntur dist. news

మద్యానికి బానిస అయ్యాడు. మత్తు కోసం శానిటైజర్ తాగి ప్రాణం మీదకు తెచ్చు కున్నాడు. చివరకు మరణించాడు.ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. కాగా ఫిరంగిపురం మండంలో.. ఇప్పటికి ఇద్దరు శానిటైజర్ తాగి మృతి చెందారు.

మద్యానికి బానిసయ్యాడు.. శానిటైజర్​ తాగి మరణించాడు
మద్యానికి బానిసయ్యాడు.. శానిటైజర్​ తాగి మరణించాడు
author img

By

Published : Sep 22, 2020, 10:03 AM IST

శానిటైజర్ తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. పట్టణంలోని జెండా చెట్టు వీధిలో నివసిస్తున్న షేక్ అబ్దుల్ రషీద్ (40) మద్యానికి బానిసయ్యాడు. ధరలు పెరిగిన కారణంగా.. మత్తు కోసం కొన్నాళ్లుగా శానిటైజర్ తాగుతూ.. అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి శానిటైజర్ తాగి ఇంటికి చేరుకున్న అనంతరం కడుపు నొప్పితో బాధ పడ్డాడు.

రషీద్​ను కుంటుంబ సభ్యులు ఫిరంగిపురంలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రషీద్ సోమవారం మృతి చెందాడు. మృతుడి అన్న బాజిద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

శానిటైజర్ తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటుచేసుకుంది. పట్టణంలోని జెండా చెట్టు వీధిలో నివసిస్తున్న షేక్ అబ్దుల్ రషీద్ (40) మద్యానికి బానిసయ్యాడు. ధరలు పెరిగిన కారణంగా.. మత్తు కోసం కొన్నాళ్లుగా శానిటైజర్ తాగుతూ.. అనారోగ్యానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి శానిటైజర్ తాగి ఇంటికి చేరుకున్న అనంతరం కడుపు నొప్పితో బాధ పడ్డాడు.

రషీద్​ను కుంటుంబ సభ్యులు ఫిరంగిపురంలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రషీద్ సోమవారం మృతి చెందాడు. మృతుడి అన్న బాజిద్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: ముగ్గురు గిరిజన యువతుల అదృశ్యం.. ఎటెళ్లినట్టు, ఏమైనట్టు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.