Train Derailed in Tirupati: ఏపీలోని తిరుపతి రైల్వేస్టేషన్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్కు పెనుప్రమాదం తప్పింది. తిరుపతి రైల్వేస్టేషన్లో యార్డ్లోనుంచి ప్లాట్ఫాంపైకి వెళ్తున్న క్రమంలో చిన్నమలుపు వద్ద ఎక్స్ప్రెస్ జనరల్ బోగీలు ప్రమాదవశాత్తు పట్టాలు తప్పాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో.. రాత్రి 9 గంటలకు బయల్దేరాల్సిన ఎక్స్ప్రెస్.. సుమారు 3 గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరింది. ప్రమాద సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవటం వల్ల పెద్ద ముప్పే తప్పినట్టైంది.
ఇదీ చదవండి: Viral Video: టోల్ సిబ్బందికి చుక్కలు చూపించిన లారీ డ్రైవర్..