ETV Bharat / city

'రాజధాని కేసుల విచారణపై డిసెంబరులో తీర్పు'

author img

By

Published : Nov 6, 2020, 10:44 PM IST

ఏపీ రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు రాజ్యాంగ పరమైన అంశాలను ప్రస్తావించిందని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. రోజువారి విచారణలో భాగంగా జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు.. రైతుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

lawyer-narra-srinivas-on-amaravathi-petetions-in-high-court
'రాజధాని కేసుల విచారణపై డిసెంబరులో తీర్పు'

అమరావతి అంశంపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు.. రైతుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత రాజధాని మారిస్తే.. చెడు సంకేతాలు వెళ్తాయని వారు వాదించారు. పరిపాలనా రాజధానిని విశాఖకు మారిస్తే... రైతులతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘించినట్లు అవుతుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అమరావతి కోసం రైతులు భూములు ఇస్తే... ప్రజలు బాండ్లు, విరాళాలు అందజేశారని... కేంద్రం కూడా డబ్బులు ఇచ్చిందని వివరించారు.

రాజధాని మార్పు అంశంపై రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం వ్యాఖ్యానించిందని.. న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే ప్రధానంగా విచారణ జరిగినట్లు వివరించారు. రాజధాని కేసుల విచారణ ఈ నెలాఖరు వరకూ జరుగుతుందని... డిసెంబర్​లో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.

అమరావతి అంశంపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు.. రైతుల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత రాజధాని మారిస్తే.. చెడు సంకేతాలు వెళ్తాయని వారు వాదించారు. పరిపాలనా రాజధానిని విశాఖకు మారిస్తే... రైతులతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘించినట్లు అవుతుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అమరావతి కోసం రైతులు భూములు ఇస్తే... ప్రజలు బాండ్లు, విరాళాలు అందజేశారని... కేంద్రం కూడా డబ్బులు ఇచ్చిందని వివరించారు.

రాజధాని మార్పు అంశంపై రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం వ్యాఖ్యానించిందని.. న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపైనే ప్రధానంగా విచారణ జరిగినట్లు వివరించారు. రాజధాని కేసుల విచారణ ఈ నెలాఖరు వరకూ జరుగుతుందని... డిసెంబర్​లో తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి: ఇద్దరు ప్రత్యేక అధికారులు, 15 మంది సర్పంచ్‌లు సస్పెన్షన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.