ETV Bharat / city

గండిపేట వద్ద ముస్తాబైన సుందర ఉద్యానవనం.. ప్రారంభించనున్న కేటీఆర్‌

author img

By

Published : Oct 11, 2022, 6:54 AM IST

KTR to Inaugurate Osmansagar park: ఉస్మాన్‌సాగర్‌ గండిపేట వద్ద సుందరంగా తీర్చిదిద్దిన ఉద్యానవనం భాగ్యనగరవాసులకు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. పర్యాటకులు సేదతీరేలా అత్యాధునికంగా నిర్మించారు. ఆటవిడుపు కోసం వచ్చేవారితోపాటు.. సభలు, సమావేశాలకు అనువుగా పార్కును నిర్మించారు. గండిపేట ఉద్యానవనాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌.. అనంతరం హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టు కొత్వాల్‌గూడ వద్ద 85 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఎకో పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు.

osman sagar park
osman sagar park

KTR to Inaugurate Osmansagar park: భాగ్యనగరవాసులకు ఖాళీ సమయాల్లో సేదతీరేందుకు అనువుగా... అందమైన, ఆహ్లాదకర పార్కులను హెచ్​ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. విశ్రాంతి కోసమే కాకుండా సమావేశాలు... వేడుకలు నిర్వహించేందుకు వీలుగా నిర్మిస్తోంది. ఉస్మాన్‌సాగర్‌ గండిపేట వద్ద సుందరమైన ఉద్యానవనం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తేనున్నారు. ఉస్మాన్‌సాగర్‌ చెరువు ఆనుకుని... ఈ ఉద్యానవనం ఏర్పాటు చేశారు. జలాశయం అందాలను ఉద్యానవనం నుంచి వీక్షించడం సరికొత్త అనుభూతి అందించనుంది.

ఉస్మాన్‌సాగర్‌ వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ఐదున్నర ఎకరాల్లో 35కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. సుందర జలాశయం అందాలను ఆహ్లాదకర వాతావరణం మధ్య చూడటం నగరవాసులకు కనువిందు చేయనుంది. గండిపేట వచ్చే సందర్శకులకు ఈ పార్కు ఏర్పాటుతో మౌలిక వసతుల కొరత తీరనుంది. ఎంట్రెన్స్ ప్లాజాతోపాటు వాక్ వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పాట్లు, 1200 సీట్ల సామర్థ్యం గల ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ క్రాస్ రోడ్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు.

హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, నానక్‌రామగూడ, మణికొండ, అత్తాపూర్, రాజేంద్రనగర్ నుంచి తక్కువ సమయంలో ఇక్కడికి చేరుకునే వీలుంది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు కొత్వాల్ గూడ వద్ద 75 కోట్ల రూపాయలతో 85ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎకో పార్కుకు కూడా పురపాలక మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

ఇవీ చదవండి:

KTR to Inaugurate Osmansagar park: భాగ్యనగరవాసులకు ఖాళీ సమయాల్లో సేదతీరేందుకు అనువుగా... అందమైన, ఆహ్లాదకర పార్కులను హెచ్​ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. విశ్రాంతి కోసమే కాకుండా సమావేశాలు... వేడుకలు నిర్వహించేందుకు వీలుగా నిర్మిస్తోంది. ఉస్మాన్‌సాగర్‌ గండిపేట వద్ద సుందరమైన ఉద్యానవనం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తేనున్నారు. ఉస్మాన్‌సాగర్‌ చెరువు ఆనుకుని... ఈ ఉద్యానవనం ఏర్పాటు చేశారు. జలాశయం అందాలను ఉద్యానవనం నుంచి వీక్షించడం సరికొత్త అనుభూతి అందించనుంది.

ఉస్మాన్‌సాగర్‌ వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ఐదున్నర ఎకరాల్లో 35కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. సుందర జలాశయం అందాలను ఆహ్లాదకర వాతావరణం మధ్య చూడటం నగరవాసులకు కనువిందు చేయనుంది. గండిపేట వచ్చే సందర్శకులకు ఈ పార్కు ఏర్పాటుతో మౌలిక వసతుల కొరత తీరనుంది. ఎంట్రెన్స్ ప్లాజాతోపాటు వాక్ వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పాట్లు, 1200 సీట్ల సామర్థ్యం గల ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ క్రాస్ రోడ్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు.

హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, నానక్‌రామగూడ, మణికొండ, అత్తాపూర్, రాజేంద్రనగర్ నుంచి తక్కువ సమయంలో ఇక్కడికి చేరుకునే వీలుంది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు కొత్వాల్ గూడ వద్ద 75 కోట్ల రూపాయలతో 85ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎకో పార్కుకు కూడా పురపాలక మంత్రి కేటీఆర్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.