ETV Bharat / city

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ

author img

By

Published : Jul 30, 2020, 12:24 PM IST

Updated : Jul 30, 2020, 12:52 PM IST

krishna river managment board letter to andhrapradesh government
ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ

12:20 July 30

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని... ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ కొత్త ప్రాజెక్ట్​ చేపడుతోందని గతంలోనే తెలంగాణ ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమైందని తాజాగా మరోమారు లేఖ రాసింది.  

తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ముందుకెళ్లవద్దని తాము గతంలోనే తెలిపామన్న బోర్డు... ప్రాజెక్ట్ డీపీఆర్ కూడా తమకు అందించలేదని లేఖలో పేర్కొంది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యుడు హరికేష్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

12:20 July 30

ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖ

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని... ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏపీ కొత్త ప్రాజెక్ట్​ చేపడుతోందని గతంలోనే తెలంగాణ ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమైందని తాజాగా మరోమారు లేఖ రాసింది.  

తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ముందుకెళ్లవద్దని తాము గతంలోనే తెలిపామన్న బోర్డు... ప్రాజెక్ట్ డీపీఆర్ కూడా తమకు అందించలేదని లేఖలో పేర్కొంది. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యుడు హరికేష్ మీనా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు

Last Updated : Jul 30, 2020, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.