ETV Bharat / city

సాధారణ రైతులా సబ్​ కలెక్టర్​.. కారణమేమంటే.! - sub collector in farmer getup checked fertiliser shops

రోజూలాగే ఆ రోజు కూడా దుకాణానికి రైతులు వస్తున్నారు.. పోతున్నారు. వారికి కావాల్సిన ఎరువులు, మందులు కొనుగోలు చేస్తున్నారు. ఇంతలో అక్కడికి ఒక రైతు వచ్చారు. యూరియా, డీఏపీ అడిగారు. దుకాణ యజమాని సదరు రైతుకు సంబంధిత బిల్లు రాసిచ్చి.. సరుకుల కోసం గోడౌన్​కు పంపించారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చిన రైతు.. ఆ యజమానికి దిమ్మ తిరిగేలా షాక్​ ఇచ్చారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే..

sub collector in farmer getup
రైతు అవతారంలో సబ్​ కలెక్టర్​
author img

By

Published : Aug 7, 2021, 5:52 PM IST

ఫర్టిలైజర్స్​ మాఫియా.. రైతులను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతోంది. ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని ఎరువుల దుకాణాలను ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ఆగడాలు ఆగడం లేదు. అసలే ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టంతో అల్లాడిపోతున్న రైతులకు పెరిగిన పెట్టుబడులు నెత్తిన కుంపటిలా మారాయి. ప్రభుత్వం చెప్పిన ధరకంటే అధిక ధరకు విక్రయిస్తూ వారిని ఆర్థిక కష్టాలకు గురిచేస్తున్నారు. అలాంటి ఎరువుల దుకాణాలపై పంజా విసిరారు ఓ సబ్​ కలెక్టర్​.. మారువేషంలో ఎరువుల దుకాణాలకు వెళ్లి వారికి ముచ్చెమటల పట్టించారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో ఎరువులను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతున్నారనే సమాచారంతో.. జిల్లా కలెక్టర్ జే నివాస్.. చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్.. పలు ఎరువుల దుకాణాల్లో రైతు వేషంలో తనిఖీలు చేపట్టారు. నేత లుంగీ, చిరిగిన చొక్కా, మెడలో తువాలు ధరించి రైతులా పలు షాపులకు వెళ్లారు.

ఎమ్మార్పీ ధరలను మించి

మొదటగా కైకలూరు మండల కేంద్రంలోని వాసవీ ఫెర్టిలైజర్స్​కు వెళ్లి యూరియా, డీఏపీ ధరలను సబ్ కలెక్టర్ అడిగారు. తమ దగ్గర ఆ ఎరువులు లేవనే సరికి మండలంలోని వెంకటనాగదత్త ఏజెన్సీ​కి వెళ్లారు. అక్కడ బస్తా యూరియాకు రూ.280, డీఏపీకి రూ.1250 చొప్పున తీసుకున్నారు. అనంతరం తెల్ల పేపరుపై రశీదు రాసి గోడౌన్​కు వెళ్లి ఎరువులు తీసుకోవాలని షాపు యజమాని సూచించారు. అతను చెప్పిన విధంగానే వెళ్లి ఎరువులను తీసుకుని తిరిగి దుకాణం వద్దకు చేరకున్న సబ్ కలెక్టర్... యూరియా ఎమ్మార్పీ ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ రూ.1200 కాగా రూ.1250కి అమ్ముతున్న తీరును స్వయంగా గుర్తించారు. వెంటనే సహాయ వ్యవసాయ సంచాలకులు, కైకలూరు తహసీల్దార్​ను పిలిచి గోదామును తనిఖీ చేయించారు. ఆధార్ బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్న రెండు దుకాణాలపై కేసు నమోదు చేయాలని అధికారులను సబ్​కలెక్టర్​ ఆదేశించారు.

మరో చోట

ఇదే విధంగా ముదినేపల్లి మండలం దేవపుడి గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణేష్ ట్రేడర్స్​​ను తనిఖీ చేసేందుకు సబ్ కలెక్టర్ వెళ్లగా.. ఆ దుకాణం మూసి ఉంది. దీంతో సంబంధిత షాపును తనిఖీ చేసి డీలర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్​ చెంద్​ ఆదేశించారు. రైతులకు అధిక ధరలకు ఎరువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: cotton farmers: దళారుల దగా... విత్తన పత్తి రైతులు విలవిల

ఫర్టిలైజర్స్​ మాఫియా.. రైతులను కన్నీటి సంద్రంలో ముంచెత్తుతోంది. ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని ఎరువుల దుకాణాలను ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ఆగడాలు ఆగడం లేదు. అసలే ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్టంతో అల్లాడిపోతున్న రైతులకు పెరిగిన పెట్టుబడులు నెత్తిన కుంపటిలా మారాయి. ప్రభుత్వం చెప్పిన ధరకంటే అధిక ధరకు విక్రయిస్తూ వారిని ఆర్థిక కష్టాలకు గురిచేస్తున్నారు. అలాంటి ఎరువుల దుకాణాలపై పంజా విసిరారు ఓ సబ్​ కలెక్టర్​.. మారువేషంలో ఎరువుల దుకాణాలకు వెళ్లి వారికి ముచ్చెమటల పట్టించారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లాలో ఎరువులను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతున్నారనే సమాచారంతో.. జిల్లా కలెక్టర్ జే నివాస్.. చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్.. పలు ఎరువుల దుకాణాల్లో రైతు వేషంలో తనిఖీలు చేపట్టారు. నేత లుంగీ, చిరిగిన చొక్కా, మెడలో తువాలు ధరించి రైతులా పలు షాపులకు వెళ్లారు.

ఎమ్మార్పీ ధరలను మించి

మొదటగా కైకలూరు మండల కేంద్రంలోని వాసవీ ఫెర్టిలైజర్స్​కు వెళ్లి యూరియా, డీఏపీ ధరలను సబ్ కలెక్టర్ అడిగారు. తమ దగ్గర ఆ ఎరువులు లేవనే సరికి మండలంలోని వెంకటనాగదత్త ఏజెన్సీ​కి వెళ్లారు. అక్కడ బస్తా యూరియాకు రూ.280, డీఏపీకి రూ.1250 చొప్పున తీసుకున్నారు. అనంతరం తెల్ల పేపరుపై రశీదు రాసి గోడౌన్​కు వెళ్లి ఎరువులు తీసుకోవాలని షాపు యజమాని సూచించారు. అతను చెప్పిన విధంగానే వెళ్లి ఎరువులను తీసుకుని తిరిగి దుకాణం వద్దకు చేరకున్న సబ్ కలెక్టర్... యూరియా ఎమ్మార్పీ ధర రూ.266.50 కాగా రూ.280, డీఏపీ రూ.1200 కాగా రూ.1250కి అమ్ముతున్న తీరును స్వయంగా గుర్తించారు. వెంటనే సహాయ వ్యవసాయ సంచాలకులు, కైకలూరు తహసీల్దార్​ను పిలిచి గోదామును తనిఖీ చేయించారు. ఆధార్ బయోమెట్రిక్ లేకుండా, బిల్ ఇవ్వకుండా అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్న రెండు దుకాణాలపై కేసు నమోదు చేయాలని అధికారులను సబ్​కలెక్టర్​ ఆదేశించారు.

మరో చోట

ఇదే విధంగా ముదినేపల్లి మండలం దేవపుడి గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణేష్ ట్రేడర్స్​​ను తనిఖీ చేసేందుకు సబ్ కలెక్టర్ వెళ్లగా.. ఆ దుకాణం మూసి ఉంది. దీంతో సంబంధిత షాపును తనిఖీ చేసి డీలర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్​ చెంద్​ ఆదేశించారు. రైతులకు అధిక ధరలకు ఎరువులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: cotton farmers: దళారుల దగా... విత్తన పత్తి రైతులు విలవిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.