ETV Bharat / city

సరకులు కొనాలంటే.. ఏరు దాటాల్సిందే!

author img

By

Published : Aug 22, 2020, 12:41 AM IST

కాలం మారుతున్నది. సమాజం అభివృద్ధిబాటలో పరుగెడుతున్నది. కానీ.. తమ బతుకులు మాత్రం రోజురోజుకు అగాథంలోకి పోతున్నాయంటున్నారు గిరిజనులు. అగ్గిపెట్టె నుంచి ఆహార పదార్ధాల వరకూ ఏవి కొనాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిలోమీటర్ల దూరం ఈతకొట్టుకుంటూ పోవాలి... తినకుంటే ప్రాణాలు పోతాయి.. తెచ్చుకోవటానికి పోతే తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి.. ఈ గిరిపుత్రుల కష్టాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

kilometers away the tribesmen go swimming and fetch daily necessities in visakha agency
సరుకులు కొనాలంటే.. ఏరు దాటాల్సిందే!

ఆ ప్రాంతంలో నిత్యావసర సరకులు తెచ్చుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పోవాల్సిందే. కిలోమీటర్ల కొద్ది ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి. వర్షాకాలంలో పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. చిన్న వంతెన నిర్మిస్తే తమ బతుకులు మారుతాయంటున్నారు గిరిపుత్రులు.

ఏపీలోని విశాఖ ఏజెన్సీ సముద్రమట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. పాడేరు మన్యంలో ముఖ్యంగా పెదబయలు, ముంచింగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లోని శివారు గ్రామాలకు వెళ్లాలంటే ఏరులు ఈదుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే.

అగ్గిపెట్టె తెచ్చుకోవాలన్న ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లాలి. ఇక్కడ గిరిజనులకు కావాల్సింది చిన్న వంతెన మాత్రమే. కోడి మామిడి గెడ్డ అవతల ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల గిరి పల్లెలు ఉన్నాయి. ఆంధ్రాలో జి.మాడుగుల, పెదబయలు మండలాలకు చెందిన గ్రామాల గిరిజనులది కూడా ఇదే పరిస్థితి. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వారానికోసారి సమీపంలో మద్దిగరువు సంతకు వెళ్తారు.

సంతకు రావడానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం 4-5 గంటల పాటు కాలినడకన వచ్చి మిగతా దూరం ఈదుతూ నిత్యవసరాల కోసం వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. కావలసిన సామగ్రి కొనుగోలు చేసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటారు. పెద్ద మూట కట్టి ప్రవాహంలో వదిలేస్తారు. శరీరానికి డిప్పలు కట్టుకుని నీటిలో ఈదుతూ.. మరో చేతితో మూటను తోస్తూ అవతలి ఒడ్డుకు చేరుకుంటారు.

ప్రభుత్వాలు మారినా మా కష్టాలు తొలగించే నాథుడే లేడంటూ నిట్టూరుస్తున్నారు గిరిజనులు. మహిళలు సైతం మగవారిని పట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతారు. అధికారులు స్పందించి వంతెన నిర్మిస్తే మా కష్టాల సగం తొలగినట్టే అంటున్నారు గిరిజనులు.

సరుకులు కొనాలంటే.. ఏరు దాటాల్సిందే!

ఇదీ చూడండి

కొవిడ్ బాధితులకు ఏ ఇబ్బంది రావొద్దు: సీఎం జగన్

ఆ ప్రాంతంలో నిత్యావసర సరకులు తెచ్చుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని పోవాల్సిందే. కిలోమీటర్ల కొద్ది ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చి సరకులు తీసుకోవాల్సిన పరిస్థితి. వర్షాకాలంలో పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. చిన్న వంతెన నిర్మిస్తే తమ బతుకులు మారుతాయంటున్నారు గిరిపుత్రులు.

ఏపీలోని విశాఖ ఏజెన్సీ సముద్రమట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. పాడేరు మన్యంలో ముఖ్యంగా పెదబయలు, ముంచింగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లోని శివారు గ్రామాలకు వెళ్లాలంటే ఏరులు ఈదుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిందే.

అగ్గిపెట్టె తెచ్చుకోవాలన్న ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లాలి. ఇక్కడ గిరిజనులకు కావాల్సింది చిన్న వంతెన మాత్రమే. కోడి మామిడి గెడ్డ అవతల ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల గిరి పల్లెలు ఉన్నాయి. ఆంధ్రాలో జి.మాడుగుల, పెదబయలు మండలాలకు చెందిన గ్రామాల గిరిజనులది కూడా ఇదే పరిస్థితి. నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వారానికోసారి సమీపంలో మద్దిగరువు సంతకు వెళ్తారు.

సంతకు రావడానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం 4-5 గంటల పాటు కాలినడకన వచ్చి మిగతా దూరం ఈదుతూ నిత్యవసరాల కోసం వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. కావలసిన సామగ్రి కొనుగోలు చేసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటారు. పెద్ద మూట కట్టి ప్రవాహంలో వదిలేస్తారు. శరీరానికి డిప్పలు కట్టుకుని నీటిలో ఈదుతూ.. మరో చేతితో మూటను తోస్తూ అవతలి ఒడ్డుకు చేరుకుంటారు.

ప్రభుత్వాలు మారినా మా కష్టాలు తొలగించే నాథుడే లేడంటూ నిట్టూరుస్తున్నారు గిరిజనులు. మహిళలు సైతం మగవారిని పట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతారు. అధికారులు స్పందించి వంతెన నిర్మిస్తే మా కష్టాల సగం తొలగినట్టే అంటున్నారు గిరిజనులు.

సరుకులు కొనాలంటే.. ఏరు దాటాల్సిందే!

ఇదీ చూడండి

కొవిడ్ బాధితులకు ఏ ఇబ్బంది రావొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.