ETV Bharat / city

YS Viveka murder case : ' వైఎస్ వివేకా హత్యా నేరాన్ని నాపై వేసుకుంటే రూ.10కోట్లు'

ys Viveka murder case : ఏపీ మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్యానేరాన్ని అంగీకరిస్తే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనకు ఆఫర్‌ ఇచ్చారని గంగాధర్‌రెడ్డి తెలిపారు. మరో ఇద్దరు, ముగ్గురితో కలిసి హత్యే చేసినట్లు సిట్‌ అధికారుల ఎదుట అంగీకరించమని శివశంకర్‌రెడ్డి కోరారన్నారు. ఈ మేరకు సీబీఐకి కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు.

author img

By

Published : Feb 27, 2022, 7:11 AM IST

ys Viveka murder case
GANGADHAR REDDY

YS Viveka murder case : కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకాను హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం తెలిపారు. ఆ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారంటూ శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యానేరాన్ని నీపై వేసుకో. మరో ఇద్దరు, ముగ్గురితో కలిసి నువ్వే హత్య చేసినట్లు సిట్‌ అధికారుల ఎదుట అంగీకరించు. వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకా హత్యకు ప్రణాళిక వేసి, కొత్తవాళ్లతో ఆయన్ను హత్య చేయించా. హత్య చేసినవారిని పోలీసులు విచారిస్తే.. వారు అసలు విషయం చెప్పేస్తారేమోనని భయంగా ఉంది. వారు నిజం చెప్పేస్తే నేను, మిగతా వారు ఇబ్బందుల్లో పడతాం’ అంటూ శివశంకర్‌రెడ్డి వాపోయారని గంగాధర్‌రెడ్డి వివరించారు. పులివెందుల వాసి అయిన గంగాధర్‌రెడ్డి 2012 నుంచి యాడికిలో ఉంటున్నారు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉండేవారు. గతేడాది అక్టోబరు 2న సీబీఐ అధికారులు ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ‘వివేకా హత్యానేరాన్ని నీపై వేసుకుంటే నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తా. పోలీసుల సంగతి నేను చూసుకుంటా. కొంతకాలం తర్వాత నువ్వు బయటకొచ్చేయొచ్చు’ అని కూడా శివశంకర్‌రెడ్డి చెప్పారని గంగాధర్‌రెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత బాబాయ్‌ హత్య విషయమని.. తేడా వస్తే తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటాననే ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ని తాను తిరస్కరించానని ఆయన వాంగ్మూలంలో వివరించారు. గంగాధర్‌రెడ్డి వాంగ్మూలంలోని ఇతర ప్రధానాంశాలివే..

అవినాష్‌, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల ప్రమేయం ఉంటుందనుకున్నా..
వివేకా గుండెపోటుతో చనిపోయారని 2019 మార్చి 15న టీవీల్లో చూసి, ఇతర స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ఆదేశాల మేరకు ఘటనాస్థలంలో రక్తపుమడుగు శుభ్రం చేస్తున్నారని తెలిసిన తర్వాత.. హత్య వెనుక వీరి ప్రమేయమే ఉంటుందని అనుకున్నా. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల గురించి నాకు బాగా తెలుసు. వారి ప్రణాళిక లేకుండా వివేకాను హత్యచేసే ధైర్యం ఎవరికీ ఉండదు. అందుకే వారు బెడ్రూం, బాత్రూంలలో రక్తపు మడుగును శుభ్రం చేయించి ఆధారాలు ధ్వంసం చేశారు. వారి ప్రమేయం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసేవారు.

వివేకాను అంతం చేయాలనుకున్నారు
కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వారి కుటుంబానికి వై.ఎస్‌.వివేకానందరెడ్డితో తీవ్ర శత్రుత్వం ఉంది. వివేకా అనుచరులు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వారి కుటుంబాన్ని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సరిగా పట్టించుకునేవారు కాదు. అందుకే వారంతా వివేకాను అంతం చేయాలనుకునేవారు. రాజకీయాల్లో ఉనికి కోసం ఇదంతా చేసేవారు. వివేకానందరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి... అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు ఎన్నడూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులకు పోటీచేసే అవకాశం ఇవ్వలేదు.

అవినాష్‌రెడ్డి పీఏ అక్కడే ఉన్నారు
2001-05 మధ్య మా నాన్న పులివెందుల ఎంపీటీసీ సభ్యునిగా పనిచేశారు. నేను స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాణ్ని. వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు సన్నిహిత అనుచరుడిగా వ్యవహరించా. 2012లో అనంతపురం జిల్లా యాడికికి వెళ్లి అక్కడే స్థిరపడ్డాను. అయినా సరే, పై ముగ్గురితో సంప్రదింపుల్లో ఉండేవాణ్ని. ఇప్పటికీ శివశంకర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతున్నా. ఏడాది నుంచి ఆయనతో వ్యక్తిగత భేటీలకు దూరంగా ఉంటున్నా. 2019 ఆగస్టు చివరి వారంలో శివశంకర్‌రెడ్డి నాకు వాట్సప్‌ కాల్‌ చేశారు. అత్యవసరంగా మాట్లాడాలని, పులివెందులకు 8 కి.మీ. దూరంలోని గోదాము వద్దకు రావాలని పిలిస్తే వెళ్లాను. అప్పటికే అక్కడ అవినాష్‌రెడ్డి పీఏ రమణారెడ్డి, డ్రైవర్‌ ఉన్నారు. రమణారెడ్డి నా ఫోన్‌ తీసుకుని, మొదట అంతస్తుకు వెళ్లాలని సూచించారు. అక్కడ శివశంకర్‌రెడ్డి ఉన్నారు. నా బాగోగులతో పాటు, ఏం చేస్తున్నానని అడిగారు. ఏమీ చేయట్లేదని, తిరుపతిలో నా భార్యకు ఉద్యోగం ఇప్పించాలని ఆయన్ను అడిగాను. ‘నీ భార్య ఉద్యోగం గురించి ఎందుకు అంతలా ఆందోళన చెందుతావు.. నీకు మంచి ఆఫర్‌ ఇస్తాను’ అని చెప్పారు. వివేకా హత్య నేరాన్ని నాపై వేసుకోమన్నారు. ‘వివేకా హత్యకేసు దర్యాప్తును సిట్‌ అధికారులు ముమ్మరం చేశారు. వారికి నాపై అనుమానం ఉంది’ అని శివశంకర్‌రెడ్డి నాతో చెప్పారు. ఆయన ఇచ్చిన ఆఫర్‌పై వారం రోజుల తర్వాత ఆలోచించి చెబుతానని చెప్పి... తర్వాత తిరస్కరించాను. భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఇలాంటి వ్యవహారాల్లో ఎలా పనిచేస్తారో నాకు బాగా తెలుసు.

హత్య ఎందుకు చేశారంటే..ఏమని చెప్పాలని అడిగితే..
హత్యానేరాన్ని నాపైన వేసుకుంటే.. వివేకాను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎలా చంపావని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలని శివశంకర్‌రెడ్డిని అడిగా. దానికి ఆయన ఓ కథ చెప్పారు. ‘వివేకా ఇంట్లో చాలా డబ్బు ఉందని మాకు తెలిసింది. ఆ సొత్తు దోచుకోవటానికి ఆయన ఇంట్లోకి వెళ్లాము. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారు. అల్మారా విరగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ శబ్దానికి వివేకాకు మెలకువ వచ్చింది. దాంతో ఆయన్ను చంపటం తప్ప మాకు వేరే దారి కనిపించలేదు’ అంటూ దర్యాప్తు అధికారులతో చెప్పాలని శివశంకర్‌రెడ్డి నాకు సూచించారు. హత్యాస్థలంలో లభించిన లేఖ గురించి పోలీసులు ప్రశ్నిస్తే ఏమని సమాధానమివ్వాలని ఆయన్ను అడగ్గా... ‘కేసును పక్కదారి పట్టించేందుకు వివేకాతో బలవంతంగా లేఖ రాయించాం’ అని చెప్పాలన్నారు.

ఇదీ చదవండి: ys viveka murder case : 'గుండెపోటు ప్రచారం మొదలుపెట్టింది ఆయనే..'

YS Viveka murder case : కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకాను హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం తెలిపారు. ఆ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారంటూ శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ‘వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యానేరాన్ని నీపై వేసుకో. మరో ఇద్దరు, ముగ్గురితో కలిసి నువ్వే హత్య చేసినట్లు సిట్‌ అధికారుల ఎదుట అంగీకరించు. వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో కలిసి వివేకా హత్యకు ప్రణాళిక వేసి, కొత్తవాళ్లతో ఆయన్ను హత్య చేయించా. హత్య చేసినవారిని పోలీసులు విచారిస్తే.. వారు అసలు విషయం చెప్పేస్తారేమోనని భయంగా ఉంది. వారు నిజం చెప్పేస్తే నేను, మిగతా వారు ఇబ్బందుల్లో పడతాం’ అంటూ శివశంకర్‌రెడ్డి వాపోయారని గంగాధర్‌రెడ్డి వివరించారు. పులివెందుల వాసి అయిన గంగాధర్‌రెడ్డి 2012 నుంచి యాడికిలో ఉంటున్నారు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉండేవారు. గతేడాది అక్టోబరు 2న సీబీఐ అధికారులు ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ‘వివేకా హత్యానేరాన్ని నీపై వేసుకుంటే నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తా. పోలీసుల సంగతి నేను చూసుకుంటా. కొంతకాలం తర్వాత నువ్వు బయటకొచ్చేయొచ్చు’ అని కూడా శివశంకర్‌రెడ్డి చెప్పారని గంగాధర్‌రెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సొంత బాబాయ్‌ హత్య విషయమని.. తేడా వస్తే తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటాననే ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ని తాను తిరస్కరించానని ఆయన వాంగ్మూలంలో వివరించారు. గంగాధర్‌రెడ్డి వాంగ్మూలంలోని ఇతర ప్రధానాంశాలివే..

అవినాష్‌, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల ప్రమేయం ఉంటుందనుకున్నా..
వివేకా గుండెపోటుతో చనిపోయారని 2019 మార్చి 15న టీవీల్లో చూసి, ఇతర స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ఆదేశాల మేరకు ఘటనాస్థలంలో రక్తపుమడుగు శుభ్రం చేస్తున్నారని తెలిసిన తర్వాత.. హత్య వెనుక వీరి ప్రమేయమే ఉంటుందని అనుకున్నా. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల గురించి నాకు బాగా తెలుసు. వారి ప్రణాళిక లేకుండా వివేకాను హత్యచేసే ధైర్యం ఎవరికీ ఉండదు. అందుకే వారు బెడ్రూం, బాత్రూంలలో రక్తపు మడుగును శుభ్రం చేయించి ఆధారాలు ధ్వంసం చేశారు. వారి ప్రమేయం లేకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసేవారు.

వివేకాను అంతం చేయాలనుకున్నారు
కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, వారి కుటుంబానికి వై.ఎస్‌.వివేకానందరెడ్డితో తీవ్ర శత్రుత్వం ఉంది. వివేకా అనుచరులు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వారి కుటుంబాన్ని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సరిగా పట్టించుకునేవారు కాదు. అందుకే వారంతా వివేకాను అంతం చేయాలనుకునేవారు. రాజకీయాల్లో ఉనికి కోసం ఇదంతా చేసేవారు. వివేకానందరెడ్డి, ఆయన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి... అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు ఎన్నడూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులకు పోటీచేసే అవకాశం ఇవ్వలేదు.

అవినాష్‌రెడ్డి పీఏ అక్కడే ఉన్నారు
2001-05 మధ్య మా నాన్న పులివెందుల ఎంపీటీసీ సభ్యునిగా పనిచేశారు. నేను స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాణ్ని. వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలకు సన్నిహిత అనుచరుడిగా వ్యవహరించా. 2012లో అనంతపురం జిల్లా యాడికికి వెళ్లి అక్కడే స్థిరపడ్డాను. అయినా సరే, పై ముగ్గురితో సంప్రదింపుల్లో ఉండేవాణ్ని. ఇప్పటికీ శివశంకర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడుతున్నా. ఏడాది నుంచి ఆయనతో వ్యక్తిగత భేటీలకు దూరంగా ఉంటున్నా. 2019 ఆగస్టు చివరి వారంలో శివశంకర్‌రెడ్డి నాకు వాట్సప్‌ కాల్‌ చేశారు. అత్యవసరంగా మాట్లాడాలని, పులివెందులకు 8 కి.మీ. దూరంలోని గోదాము వద్దకు రావాలని పిలిస్తే వెళ్లాను. అప్పటికే అక్కడ అవినాష్‌రెడ్డి పీఏ రమణారెడ్డి, డ్రైవర్‌ ఉన్నారు. రమణారెడ్డి నా ఫోన్‌ తీసుకుని, మొదట అంతస్తుకు వెళ్లాలని సూచించారు. అక్కడ శివశంకర్‌రెడ్డి ఉన్నారు. నా బాగోగులతో పాటు, ఏం చేస్తున్నానని అడిగారు. ఏమీ చేయట్లేదని, తిరుపతిలో నా భార్యకు ఉద్యోగం ఇప్పించాలని ఆయన్ను అడిగాను. ‘నీ భార్య ఉద్యోగం గురించి ఎందుకు అంతలా ఆందోళన చెందుతావు.. నీకు మంచి ఆఫర్‌ ఇస్తాను’ అని చెప్పారు. వివేకా హత్య నేరాన్ని నాపై వేసుకోమన్నారు. ‘వివేకా హత్యకేసు దర్యాప్తును సిట్‌ అధికారులు ముమ్మరం చేశారు. వారికి నాపై అనుమానం ఉంది’ అని శివశంకర్‌రెడ్డి నాతో చెప్పారు. ఆయన ఇచ్చిన ఆఫర్‌పై వారం రోజుల తర్వాత ఆలోచించి చెబుతానని చెప్పి... తర్వాత తిరస్కరించాను. భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఇలాంటి వ్యవహారాల్లో ఎలా పనిచేస్తారో నాకు బాగా తెలుసు.

హత్య ఎందుకు చేశారంటే..ఏమని చెప్పాలని అడిగితే..
హత్యానేరాన్ని నాపైన వేసుకుంటే.. వివేకాను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఎలా చంపావని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలని శివశంకర్‌రెడ్డిని అడిగా. దానికి ఆయన ఓ కథ చెప్పారు. ‘వివేకా ఇంట్లో చాలా డబ్బు ఉందని మాకు తెలిసింది. ఆ సొత్తు దోచుకోవటానికి ఆయన ఇంట్లోకి వెళ్లాము. ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నారు. అల్మారా విరగ్గొట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ శబ్దానికి వివేకాకు మెలకువ వచ్చింది. దాంతో ఆయన్ను చంపటం తప్ప మాకు వేరే దారి కనిపించలేదు’ అంటూ దర్యాప్తు అధికారులతో చెప్పాలని శివశంకర్‌రెడ్డి నాకు సూచించారు. హత్యాస్థలంలో లభించిన లేఖ గురించి పోలీసులు ప్రశ్నిస్తే ఏమని సమాధానమివ్వాలని ఆయన్ను అడగ్గా... ‘కేసును పక్కదారి పట్టించేందుకు వివేకాతో బలవంతంగా లేఖ రాయించాం’ అని చెప్పాలన్నారు.

ఇదీ చదవండి: ys viveka murder case : 'గుండెపోటు ప్రచారం మొదలుపెట్టింది ఆయనే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.