ETV Bharat / city

ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ సేవల నిలుపుదలపై కలెక్టర్‌ ఆగ్రహం

author img

By

Published : May 1, 2021, 11:26 AM IST

కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు సేవలు నిలుపదల చేయడంపై...ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఏపీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దాదాపు 10 ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రులు సేవలు నిలిపివేయడంపై... కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని... లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పడంతో... ఆస్పత్రి వర్గాలు వెనక్కి తగ్గాయి.

kadapa-district-collector-angry-over-suspension-of-private-hospital-services
ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ సేవల నిలుపుదలపై కలెక్టర్‌ ఆగ్రహం
ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ సేవల నిలుపుదలపై కలెక్టర్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో... ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం కరోనా వేళ వైద్య సేవలు నిలిపేసే విధంగా నిర్ణయం తీసుకోవడం... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే కారణంతో ఈ నెల 28న కడప నగరంలోని కొమ్మా ఆసుపత్రి, కేసీహెచ్ ఆసుపత్రిపై విజిలెన్స్ విచారణ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన కడప నగరంలోని 10 ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల వద్ద..... బోర్డులు వెలిశాయి. కొవిడ్ కొత్త రోగులను చేర్చుకునేది లేదని బ్యానర్లు కట్టారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆఘమేఘాల మీద... ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. జిల్లా వైద్యాధికారులు, పోలీసు, విజిలెన్స్, ఇంటిలిజెన్స్ అధికారులు... పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సేవలు నిలిపి వేయడం మంచిది కాదని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే... కేసులు నమోదు చేయకుండా ఎలా ఉంటారంటూ కలెక్టర్ ప్రశ్నించారు. అధిక ఫీజులు వసూలు చేసిన ఆధారాలు,... బాధితుల స్టేట్ మెంట్లను వారి ముందుంచారు. ఈ క్రమంలో...ఎట్టకేలకు దిగొచ్చిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం పొరపాటు చేశామని ఒప్పుకున్నారు. క్షమించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటామని వైద్యులు కోరారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా నడుచుకోవాలని... ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే విచారణ కొనసాగుతుందని... కలెక్టర్ హరికిరణ్ తెల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విజిలెన్స్, పోలీసు విచారణలు కొనసాగుతాయని.. కొవిడ్ సమయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కొవిడ్‌ వైద్యం అందించేందుకు మరిన్ని ఆసుపత్రులు అనుమతి కోరాయని...త్వరలో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. కరోనా వేళ ప్రైవేటు యాజమాన్యం సేవలు నిలిపివేయడంపై ప్రజలంతా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి: భూముల కబ్జాపై అనిశా, విజిలెన్స్ విచారణ ప్రారంభం

ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్‌ సేవల నిలుపుదలపై కలెక్టర్‌ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో... ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం కరోనా వేళ వైద్య సేవలు నిలిపేసే విధంగా నిర్ణయం తీసుకోవడం... ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ నీయాంశమైంది. కొవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే కారణంతో ఈ నెల 28న కడప నగరంలోని కొమ్మా ఆసుపత్రి, కేసీహెచ్ ఆసుపత్రిపై విజిలెన్స్ విచారణ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన కడప నగరంలోని 10 ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల వద్ద..... బోర్డులు వెలిశాయి. కొవిడ్ కొత్త రోగులను చేర్చుకునేది లేదని బ్యానర్లు కట్టారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆఘమేఘాల మీద... ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. జిల్లా వైద్యాధికారులు, పోలీసు, విజిలెన్స్, ఇంటిలిజెన్స్ అధికారులు... పాల్గొన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సేవలు నిలిపి వేయడం మంచిది కాదని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే... కేసులు నమోదు చేయకుండా ఎలా ఉంటారంటూ కలెక్టర్ ప్రశ్నించారు. అధిక ఫీజులు వసూలు చేసిన ఆధారాలు,... బాధితుల స్టేట్ మెంట్లను వారి ముందుంచారు. ఈ క్రమంలో...ఎట్టకేలకు దిగొచ్చిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం పొరపాటు చేశామని ఒప్పుకున్నారు. క్షమించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. మరోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటామని వైద్యులు కోరారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా నడుచుకోవాలని... ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తే విచారణ కొనసాగుతుందని... కలెక్టర్ హరికిరణ్ తెల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విజిలెన్స్, పోలీసు విచారణలు కొనసాగుతాయని.. కొవిడ్ సమయంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కొవిడ్‌ వైద్యం అందించేందుకు మరిన్ని ఆసుపత్రులు అనుమతి కోరాయని...త్వరలో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు. కరోనా వేళ ప్రైవేటు యాజమాన్యం సేవలు నిలిపివేయడంపై ప్రజలంతా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి: భూముల కబ్జాపై అనిశా, విజిలెన్స్ విచారణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.