ETV Bharat / city

Intermediate First Year Exams : ఇంటర్ ఫస్ట్​ఇయర్ పరీక్షలు ప్రారంభం.. మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్ష

author img

By

Published : Oct 25, 2021, 9:11 AM IST

Updated : Oct 25, 2021, 12:55 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఉదయం 9గంటలకు ప్రారంభమైన తొలిపరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు సాగింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ... విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా.. వారికోసం 17 వందల68 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 31 ఆదివారం కూడా పరీక్ష నిర్వహిస్తున్నారు.

Intermediate First Year Exams Started
Intermediate First Year Exams Started

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నెల రోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు రాస్తున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే ప్రమోట్‌ అయి రెండో సంవత్సరం చదువుతున్నారు. హైకోర్టు, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వచ్చే ఏడాది కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోతే... ప్రస్తుతం రాసిన ప్రథమ సంవత్సరం మార్కులనే ప్రామాణికంగా తీసుకుని రెండో ఏడాదికి ఉత్తీర్ణత చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా.. వారికోసం 17 వందల 68 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

అయితే అనేక మంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లోనే రాయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండో సంవత్సరం సిలబస్‌ చదువుతూనే... మళ్లీ పరీక్షల కోసం మొదటి సంవత్సరం సిలబస్‌ ప్రిపేర్‌ అవ్వాల్సి వస్తోందని అంటున్నారు.

మరోవైపు గత ఏడాది మొత్తం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడంతో... లక్షలాది మంది వాటికి దూరం కావాల్సి వచ్చింది. ఇంటర్‌నెట్‌ సమస్యల కారణంగా చాలా మంది క్లాసులు ఫాలో అవలేకపోయారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈనెల 31 ఆదివారం కూడా పరీక్ష ఉంటుందని... విద్యార్థులు గమనించాలని ఇంటర్‌ బోర్డు కోరింది.

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నెల రోజుల తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు రాస్తున్న ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులను ఇప్పటికే ప్రమోట్‌ అయి రెండో సంవత్సరం చదువుతున్నారు. హైకోర్టు, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వచ్చే ఏడాది కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోతే... ప్రస్తుతం రాసిన ప్రథమ సంవత్సరం మార్కులనే ప్రామాణికంగా తీసుకుని రెండో ఏడాదికి ఉత్తీర్ణత చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా.. వారికోసం 17 వందల 68 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

అయితే అనేక మంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లోనే రాయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండో సంవత్సరం సిలబస్‌ చదువుతూనే... మళ్లీ పరీక్షల కోసం మొదటి సంవత్సరం సిలబస్‌ ప్రిపేర్‌ అవ్వాల్సి వస్తోందని అంటున్నారు.

మరోవైపు గత ఏడాది మొత్తం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడంతో... లక్షలాది మంది వాటికి దూరం కావాల్సి వచ్చింది. ఇంటర్‌నెట్‌ సమస్యల కారణంగా చాలా మంది క్లాసులు ఫాలో అవలేకపోయారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈనెల 31 ఆదివారం కూడా పరీక్ష ఉంటుందని... విద్యార్థులు గమనించాలని ఇంటర్‌ బోర్డు కోరింది.

Last Updated : Oct 25, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.