ETV Bharat / city

అవంతి కళాశాలలో టెక్నికల్ ఫెస్ట్.. ఆకట్టుకున్న విద్యార్థుల నూతన ఆవిష్కరణలు.. - టెక్ రిసొనన్స్ 2కే-22

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం గుంతపల్లిలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో "టెక్ రిసొనన్స్ 2కే-22" పేరుతో టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సంద్భంగా విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ రోబోటిక్ మిషన్స్​ను ప్రదర్శించారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి.

Impressive student innovations in Technical Fest in Avanti engineering College
Impressive student innovations in Technical Fest in Avanti engineering College
author img

By

Published : Apr 29, 2022, 4:34 AM IST

అవంతి కళాశాలలో టెక్నికల్ ఫెస్ట్.. ఆకట్టుకున్న విద్యార్థుల నూతన ఆవిష్కరణలు..

రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని.. విద్యార్థులు ఆ దిశగా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మోహన్ రాయుడు, అవంతి కాలేజ్ జనరల్ సెక్రటరీ డా.ప్రియాంక తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం గుంతపల్లిలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో "టెక్ రిసొనన్స్ 2కే-22" పేరుతో టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సంద్భంగా విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ రోబోటిక్ మిషన్స్​ను ప్రదర్శించారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి.

విదార్థుల ఆవిష్కరణలను కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు.. నిశితంగా పరిశీలించారు. వాటి ప్రత్యేకత.. పని తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆలోచనలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టెక్నాలజీ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని మోహన్​రాయుడు అభిప్రాయపడ్డారు. రోజు రోజుకు టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదే క్రమంలో విద్యార్థులు వాటిపై అవగాహన పెంచుకుంటూ నూతన ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్.. పెరుగుతున్న టెక్నాలజీకి అద్దం పడుతున్నాయన్నారు.

ఇదీ చూడండి:

అవంతి కళాశాలలో టెక్నికల్ ఫెస్ట్.. ఆకట్టుకున్న విద్యార్థుల నూతన ఆవిష్కరణలు..

రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని.. విద్యార్థులు ఆ దిశగా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మోహన్ రాయుడు, అవంతి కాలేజ్ జనరల్ సెక్రటరీ డా.ప్రియాంక తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం గుంతపల్లిలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో "టెక్ రిసొనన్స్ 2కే-22" పేరుతో టెక్నికల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సంద్భంగా విద్యార్థులు తాము తయారు చేసిన వివిధ రోబోటిక్ మిషన్స్​ను ప్రదర్శించారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి.

విదార్థుల ఆవిష్కరణలను కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు.. నిశితంగా పరిశీలించారు. వాటి ప్రత్యేకత.. పని తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆలోచనలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా టెక్నాలజీ అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని మోహన్​రాయుడు అభిప్రాయపడ్డారు. రోజు రోజుకు టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదే క్రమంలో విద్యార్థులు వాటిపై అవగాహన పెంచుకుంటూ నూతన ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్స్.. పెరుగుతున్న టెక్నాలజీకి అద్దం పడుతున్నాయన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.