ETV Bharat / city

ఐఏఎస్​ల బదిలీ.. ఉత్తర్వులు జారీ - కరీంనగర్​ కలెక్టర్​ బదిలీ

karimnagar collector transfer
karimnagar collector transfer
author img

By

Published : Dec 16, 2019, 3:01 PM IST

Updated : Dec 16, 2019, 4:17 PM IST

14:59 December 16

ఐఏఎస్​ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

    కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్​పై బదిలీ వేటు పడింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్​గా సర్ఫరాజ్​ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. శాసనసభ ఎన్నికల ఖర్చు విషయంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్​తో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు వచ్చిన ఆడియో టేపులు సంచలనం రేకెత్తించాయి. తనకు వ్యతిరేకంగా కలెక్టర్ వ్యవహరించారని మంత్రి గంగుల కమలాకర్ అప్పట్లో ఆరోపించారు. 

    ఈ విషయంలో సీఎస్ జోషిని కలిసి సర్ఫరాజ్ వివరణ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ ను బదిలీ చేసిన ప్రభుత్వం... ఎక్సైజ్ కమిషనర్​గా నియమించింది. ఆయన స్థానంలో కరీంనగర్ కలెక్టర్​గా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంకను బదిలీ చేసింది. జోగులాంబ గద్వాల కలెక్టర్​గా వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించింది. 

    మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్​ల పోస్టింగుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శిగా బూసాని వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. ఇంటర్ ఫలితాల వివాదం తర్వాత వెయిటింగ్​లో ఉన్న అశోక్​ను మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్​గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు

14:59 December 16

ఐఏఎస్​ల బదిలీ.. ఉత్తర్వులు జారీ

    కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్​పై బదిలీ వేటు పడింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్​గా సర్ఫరాజ్​ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. శాసనసభ ఎన్నికల ఖర్చు విషయంలో భాజపా అభ్యర్థి బండి సంజయ్​తో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు వచ్చిన ఆడియో టేపులు సంచలనం రేకెత్తించాయి. తనకు వ్యతిరేకంగా కలెక్టర్ వ్యవహరించారని మంత్రి గంగుల కమలాకర్ అప్పట్లో ఆరోపించారు. 

    ఈ విషయంలో సీఎస్ జోషిని కలిసి సర్ఫరాజ్ వివరణ ఇచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో సర్ఫరాజ్ అహ్మద్ ను బదిలీ చేసిన ప్రభుత్వం... ఎక్సైజ్ కమిషనర్​గా నియమించింది. ఆయన స్థానంలో కరీంనగర్ కలెక్టర్​గా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంకను బదిలీ చేసింది. జోగులాంబ గద్వాల కలెక్టర్​గా వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలు అప్పగించింది. 

    మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్​ల పోస్టింగుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శిగా బూసాని వెంకటేశ్వరరావును బదిలీ చేసింది. ఇంటర్ ఫలితాల వివాదం తర్వాత వెయిటింగ్​లో ఉన్న అశోక్​ను మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్​గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి: త్వరలో లోకాయుక్త, మానవ హక్కుల సంఘాల ఏర్పాటు

Thiruvananthapuram (Kerala), Dec 16 (ANI): Kerala Chief Minister Pinarayi Vijayan protested against Citizenship Amendment Act (CAA) in Thiruvananthapuram on December 16. Leader of Opposition in the assembly Ramesh Chennithala also joined him in the protest. President Ram Nath Kovind gave his assent to Citizenship (Amendment) Bill on December 13 which will give Indian citizenship to non-Muslim refugees who faced persecution in three neighbouring countries- Pakistan, Bangladesh and Afghanistan.
Last Updated : Dec 16, 2019, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.