ETV Bharat / city

Charminar as Weekend Spot in Hyderabad : వీకెండ్ @చార్మినార్.. నెటిజన్ల వినతికి కేటీఆర్ ట్వీట్

ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేకుండా గడిపే జనం. భాగ్యనగరంలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. వీకెండ్ వస్తే మాత్రం రెక్కలు కట్టుకుని ఏదో పర్యాటక ప్రాంతానికి ఎగిరిపోతారు. నగరవాసులు వీకెండ్​లలో ఎక్కువగా వెళ్తోన్న ప్రదేశం ట్యాంక్​బండ్. ఈ మధ్య చార్మినార్​(Charminar as Weekend Spot in Hyderabad)కు రూట్ మార్చారు. కానీ అక్కడ అనుమతి లేకపోవడం వల్ల చార్మినార్ వద్ద వీకెండ్ వినోదానికి అవకాశం కల్పించాలని మంత్రి కేటీఆర్​, పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్​ కుమార్​కు ట్వీట్లు చేయడం మొదలెట్టారు. వారి విన్నపాన్ని ఆలకించిన అర్వింద్..​ చార్మినార్ వద్ద వారాంతాల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలో వారినే అడిగారు.

author img

By

Published : Oct 12, 2021, 1:50 PM IST

Updated : Oct 12, 2021, 1:56 PM IST

Charminar as Weekend Spot in Hyderabad
Charminar as Weekend Spot in Hyderabad

భాగ్యనగరవాసుల వారాంతపు విహారానికి ట్యాంక్‌బండ్‌ ఇస్తున్న జోష్‌ అంతా ఇంతా కాదు.. దీనికి తోడు చార్మినార్‌(Charminar as Weekend Spot in Hyderabad) వద్దా అవకాశం కల్పించాలంటూ నగరవాసుల నుంచి పెద్దఎత్తున వినతులొస్తున్నాయి. వీటికి ప్రభుత్వం స్పందించింది. సోమవారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ స్పష్టతనిచ్చారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌(Telangana Minister KTR), ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీల సూచన మేరకు ఇక్కడా వారాంతపు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఎలాంటి వేడుకలు చేద్దాం.. ఏమేం కావాలో సలహాలు, సూచనలివ్వాలంటూ నగరవాసుల్ని కోరారు.

దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మూసీ నుంచి ఇక్కడి దాకా నడకదారినివ్వాలని కొందరు కోరగా.. అక్కడి దుకాణాల్ని అలాగే ఉంచి మదీనా నుంచే రాకపోకలు పూర్తిగా నిలిపేయాలని కొందరు, ట్రాఫిక్‌ రద్దీ, వాహనాల పార్కింగ్‌ విషయాల్ని మరిచిపోవద్దంటూ చాలామంది సూచనలిస్తున్నారు. గండిపేట జలాశయం వద్దా ఇలాంటి కార్యక్రమాలు చేయండంటూ కొందరు నగరవాసులు కోరారు.

భాగ్యనగరవాసుల వారాంతపు విహారానికి ట్యాంక్‌బండ్‌ ఇస్తున్న జోష్‌ అంతా ఇంతా కాదు.. దీనికి తోడు చార్మినార్‌(Charminar as Weekend Spot in Hyderabad) వద్దా అవకాశం కల్పించాలంటూ నగరవాసుల నుంచి పెద్దఎత్తున వినతులొస్తున్నాయి. వీటికి ప్రభుత్వం స్పందించింది. సోమవారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ స్పష్టతనిచ్చారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌(Telangana Minister KTR), ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీల సూచన మేరకు ఇక్కడా వారాంతపు వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఎలాంటి వేడుకలు చేద్దాం.. ఏమేం కావాలో సలహాలు, సూచనలివ్వాలంటూ నగరవాసుల్ని కోరారు.

దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మూసీ నుంచి ఇక్కడి దాకా నడకదారినివ్వాలని కొందరు కోరగా.. అక్కడి దుకాణాల్ని అలాగే ఉంచి మదీనా నుంచే రాకపోకలు పూర్తిగా నిలిపేయాలని కొందరు, ట్రాఫిక్‌ రద్దీ, వాహనాల పార్కింగ్‌ విషయాల్ని మరిచిపోవద్దంటూ చాలామంది సూచనలిస్తున్నారు. గండిపేట జలాశయం వద్దా ఇలాంటి కార్యక్రమాలు చేయండంటూ కొందరు నగరవాసులు కోరారు.

Last Updated : Oct 12, 2021, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.