ETV Bharat / city

రాష్ట్రంలో నూతన బార్ల కోసం భారీగా దరఖాస్తులు

author img

By

Published : Feb 7, 2021, 7:40 AM IST

తెలంగాణలో కొత్తగా బార్ల ఏర్పాటుకు భారీ ఎత్తున వ్యాపారులు పోటీపడుతున్నారు. 159 నూతన బార్ల కోసం ఇప్పటి వరకు రెండు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 8న గడువు ముగియనుండటం వల్ల మరో వెయ్యి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

huge-number-of-applications-for-new-bars-in-telangana
రాష్ట్రంలో నూతన బార్ల కోసం భారీగా దరఖాస్తులు

తెలంగాణలో 2,216 మద్యం దుకాణాలతోపాటు 800లకుపైగా బార్లు, పబ్​లు, క్లబ్బులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 159 కొత్త బార్ల ఏర్పాటుకు గత నెల 25న రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. ఈ నెల 10న ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ విధానంలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.

లాటరీ ద్వారా ఎంపిక

2011 జనాభా ఆధారంగా బార్లకు లైసెన్సు ఫీజులను ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్ఎంసీతో పాటు ఉమ్మడి జిల్లాల వారిగా బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు, 50 నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతంలో రూ.42 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మధ్య జనాభా కలిగిన ప్రాంతాల్లో రూ.44 లక్షలు.. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.49 లక్షలు లెక్కన లాటరీ ద్వారా ఎంపికైన వారు లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అధికంగా అక్కడే..

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు చాలా స్వల్పంగా రాగా, మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వచ్చాయి. శుక్రవారం వరకు 159 బార్లకు 1,045 దరఖాస్తులు అందగా శనివారం ఒక్క రోజే వెయ్యికి పైగా వచ్చాయి. శనివారం రాత్రి వరకు 159 బార్ల ఏర్పాటుకు 2,050 దరఖాస్తులు అందినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. అందులో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో రెండు బార్లకు గాను 135, మహబూబాబాద్​లో మూడు బార్లకు 148, ఖమ్మం జిల్లా వైరాలో 2 బార్లకు 119, నల్గొండ జిల్లాలో ఆరు బార్లకు 236, యాదాద్రి జిల్లాలో ఐదు బార్లకు 282, జీహెచ్ఎంసీ పరిధిలో 55 బార్లకు 213 దరఖాస్తుల లెక్కన అందాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

సోమవారంతో గడువు ముగియనుండటం వల్ల శనివారం రోజు వచ్చిన సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో 2,216 మద్యం దుకాణాలతోపాటు 800లకుపైగా బార్లు, పబ్​లు, క్లబ్బులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 159 కొత్త బార్ల ఏర్పాటుకు గత నెల 25న రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. ఈ నెల 10న ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ విధానంలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.

లాటరీ ద్వారా ఎంపిక

2011 జనాభా ఆధారంగా బార్లకు లైసెన్సు ఫీజులను ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్ఎంసీతో పాటు ఉమ్మడి జిల్లాల వారిగా బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 50,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.30 లక్షలు, 50 నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతంలో రూ.42 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మధ్య జనాభా కలిగిన ప్రాంతాల్లో రూ.44 లక్షలు.. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.49 లక్షలు లెక్కన లాటరీ ద్వారా ఎంపికైన వారు లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అధికంగా అక్కడే..

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు చాలా స్వల్పంగా రాగా, మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వచ్చాయి. శుక్రవారం వరకు 159 బార్లకు 1,045 దరఖాస్తులు అందగా శనివారం ఒక్క రోజే వెయ్యికి పైగా వచ్చాయి. శనివారం రాత్రి వరకు 159 బార్ల ఏర్పాటుకు 2,050 దరఖాస్తులు అందినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. అందులో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో రెండు బార్లకు గాను 135, మహబూబాబాద్​లో మూడు బార్లకు 148, ఖమ్మం జిల్లా వైరాలో 2 బార్లకు 119, నల్గొండ జిల్లాలో ఆరు బార్లకు 236, యాదాద్రి జిల్లాలో ఐదు బార్లకు 282, జీహెచ్ఎంసీ పరిధిలో 55 బార్లకు 213 దరఖాస్తుల లెక్కన అందాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

సోమవారంతో గడువు ముగియనుండటం వల్ల శనివారం రోజు వచ్చిన సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.