ETV Bharat / city

Land Sale : భూముల అమ్మకానికి నేడే నోటిఫికేషన్ విడుదల

author img

By

Published : Jun 15, 2021, 7:07 AM IST

Updated : Jun 15, 2021, 7:22 AM IST

నిధుల సమీకరణకు హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ భూముల విక్రయానికి(Land Sale) సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Land Sale, Land Sale in Hyderabad, HMDa Land Sale, TSIIC Land Sale
భూముల విక్రయం, హైదరాబాద్​లో భూముల విక్రయం, తెలంగాణలో భూముల విక్రయం

నిధుల సమీకరణ కోసం... భూములు అమ్మకానికి(Land Sale) సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. హెచ్​ఎండీఏకు చెందిన కోకాపేట భూములతో పాటు టీఎస్​ఐఐసీకి చెందిన ఖానామెట్ భూముల విక్రయానికి.. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.

కోకాపేటలో హెచ్​ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్ లోని 7 ప్లాట్లతో పాటు.. గోల్డెన్ మైల్ లేఅవుట్ లోని ఒక ప్లాట్ ఉంది. 49.92 ఎకరాల విస్తీర్ణంలోని కోకాపేటలోని... ప్లాట్లు, ఖానామెట్​లో టీఎస్​ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను... అమ్మకానికి పెట్టారు. మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్​ఎండీఏ, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను..టీఎస్​ఐఐసీ నిర్వహించనుంది.

భూముల విక్రయం(Land Sale) కోసం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. హెచ్​ఎండీఏ భూములకు 25న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. టీఎస్​ఐఐసీ భూములకు 26న ప్రీబిడ్ సమావేశం జరగనుంది. జూలై 13 రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ కాగా... హెచ్​ఎండీఏ భూములకు జూలై 15న, టీఎస్​ఐఐసీ భూములకు జూలై 16న ఈ -వేలం నిర్వహిస్తారు.

నిధుల సమీకరణ కోసం... భూములు అమ్మకానికి(Land Sale) సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. హెచ్​ఎండీఏకు చెందిన కోకాపేట భూములతో పాటు టీఎస్​ఐఐసీకి చెందిన ఖానామెట్ భూముల విక్రయానికి.. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.

కోకాపేటలో హెచ్​ఎండీఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్ లోని 7 ప్లాట్లతో పాటు.. గోల్డెన్ మైల్ లేఅవుట్ లోని ఒక ప్లాట్ ఉంది. 49.92 ఎకరాల విస్తీర్ణంలోని కోకాపేటలోని... ప్లాట్లు, ఖానామెట్​లో టీఎస్​ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను... అమ్మకానికి పెట్టారు. మొత్తం 64.93 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయనున్నారు. కోకాపేట భూముల వేలం ప్రక్రియను హెచ్​ఎండీఏ, ఖానామెట్ భూముల వేలం ప్రక్రియను..టీఎస్​ఐఐసీ నిర్వహించనుంది.

భూముల విక్రయం(Land Sale) కోసం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. హెచ్​ఎండీఏ భూములకు 25న ప్రీబిడ్ సమావేశం నిర్వహిస్తారు. టీఎస్​ఐఐసీ భూములకు 26న ప్రీబిడ్ సమావేశం జరగనుంది. జూలై 13 రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ కాగా... హెచ్​ఎండీఏ భూములకు జూలై 15న, టీఎస్​ఐఐసీ భూములకు జూలై 16న ఈ -వేలం నిర్వహిస్తారు.

Last Updated : Jun 15, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.