ETV Bharat / city

వ్యవసాయం తర్వాత జౌళి, చేనేత రంగానికే డిమాండ్

author img

By

Published : Sep 20, 2019, 12:14 PM IST

జౌళి, చేనేత రంగానికి సీఎం కేసీఆర్ బడ్జెట్​లో తొలి ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి, నేతన్నల సమస్యలపై శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

వ్యవసాయం తర్వాత జౌళి, చేనేత రంగానికి అధిక డిమాండ్

వ్యవసాయం తర్వాత జౌళి, చేనేత రంగానికి రాష్ట్రంలో అధిక డిమాండ్ ఉందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి, నేతన్నల సమస్యలపై శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది జీవనోపాధి పొందుతున్న రంగం జౌళి, చేనేత రంగమని మంత్రి చెప్పారు. వరంగల్​ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్​టైల్స్ పార్క్​ నెలకొల్పటం ద్వారా జిల్లా ప్రజలకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. భూసేకరణకు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చూపిన చొరవ, ప్రారంభానికి స్థానిక ప్రజలను చైతన్యం చేసిన తీరును మంత్రి కేటీఆర్​ అభినందించారు. టీ ట్యాప్​ పేరుతో ప్రత్యేక విధానం తీసుకురావటం వల్ల రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కోసం పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పశుపతి అనే సంస్థ 243 కోట్ల రూపాయలతో, గ్యాంబుల్​ అనే సంస్థ 17కోట్ల పెట్టుబడులు పెట్టాయని... పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

వ్యవసాయం తర్వాత జౌళి, చేనేత రంగానికి అధిక డిమాండ్

ఇవీ చూడండి: పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం

వ్యవసాయం తర్వాత జౌళి, చేనేత రంగానికి రాష్ట్రంలో అధిక డిమాండ్ ఉందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. చేనేత రంగం అభివృద్ధి, నేతన్నల సమస్యలపై శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది జీవనోపాధి పొందుతున్న రంగం జౌళి, చేనేత రంగమని మంత్రి చెప్పారు. వరంగల్​ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్​టైల్స్ పార్క్​ నెలకొల్పటం ద్వారా జిల్లా ప్రజలకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. భూసేకరణకు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చూపిన చొరవ, ప్రారంభానికి స్థానిక ప్రజలను చైతన్యం చేసిన తీరును మంత్రి కేటీఆర్​ అభినందించారు. టీ ట్యాప్​ పేరుతో ప్రత్యేక విధానం తీసుకురావటం వల్ల రాష్ట్రంలో చేనేత పరిశ్రమ కోసం పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పశుపతి అనే సంస్థ 243 కోట్ల రూపాయలతో, గ్యాంబుల్​ అనే సంస్థ 17కోట్ల పెట్టుబడులు పెట్టాయని... పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

వ్యవసాయం తర్వాత జౌళి, చేనేత రంగానికి అధిక డిమాండ్

ఇవీ చూడండి: పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే ప్రభుత్వ లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.