అన్లాక్లో ప్రభుత్వ శాఖలు విధులు మొదలు పెట్టగా... హైకోర్టు కూడా అదే బాట పట్టాలని నిర్ణయించింది. ఆరు నెలల తరువాత తిరిగి హైకోర్టు భవనంలో కేసుల విచారణ కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 1 వ తేదీ నుంచి పాక్షికంగా కొన్ని బెంచ్ల్లో కేసుల విచారణ చేపట్టాలంటూ ఫుల్ కోర్టు తీర్మానించింది. కరోనా ఆందోళనతో న్యాయవాదులు హాజరుకాని పక్షంలో ఆ కేసులను వాయిదా వేసే అవకాశం ఉంది.
కేసుల విచారణ సందర్భంగా కోర్టులోకి అనుమతించే న్యాయవాదుల సంఖ్యను పరిమితం చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కోర్టుల్లో కూడా కేసుల విచారణ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం హైకోర్టు తానే ముందుగా విధులు ప్రారంభించి జిల్లా కోర్టు న్యాయాధికారులకు భరోసానివ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
ఇదీ చూడండి: సముద్ర అంబులెన్సులు ప్రారంభించిన కేరళ