ETV Bharat / city

గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు

ఏపీ గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై వేటు పడింది. సస్పెన్షన్‌లో రాజకీయ కోణం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటా విషయంలో వివాదమే కారణమని సమాచారం.

author img

By

Published : Nov 16, 2020, 6:51 PM IST

gurazala dsp suspend
గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు

గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్​ను సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలు కేసుల విచారణలో అలసత్వంగా వ్యవహరించటం ఇద్దరి సస్పెన్షన్​కు కారణమని పోలీసువర్గాలు చెబుతున్నా.. అంతర్గతంగా రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటాను మరో ప్రజాప్రతినిధికి అందించారని... సదరు ప్రజాప్రతినిధి డీజీపీకి ఫిర్యాదు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డేటాను అనధికారికంగా ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు ఇద్దరిపైనా వేటు వేసినట్టు భావిస్తున్నారు.

గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ దుర్గా ప్రసాద్​ను సస్పెండ్ చేస్తూ ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెన్షన్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పలు కేసుల విచారణలో అలసత్వంగా వ్యవహరించటం ఇద్దరి సస్పెన్షన్​కు కారణమని పోలీసువర్గాలు చెబుతున్నా.. అంతర్గతంగా రాజకీయ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓ ప్రజాప్రతినిధి వ్యక్తిగత సహాయకుడి ఫోన్ కాల్ డేటాను మరో ప్రజాప్రతినిధికి అందించారని... సదరు ప్రజాప్రతినిధి డీజీపీకి ఫిర్యాదు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డేటాను అనధికారికంగా ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు ఇద్దరిపైనా వేటు వేసినట్టు భావిస్తున్నారు.

ఇవీచూడండి: ఏ క్షణమైనా జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.