ETV Bharat / city

ఏపీ పంచాయతీ ఎన్నికలపై హౌస్ మోషన్ పిటిషన్.. రేపు విచారణ! - ap local polls 2021

ఏపీ పంచాయతీ ఎన్నికలకు ఆ రాష్ట్ర ఎస్ఈసీ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేయాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

guntur-student-field-house-motion-petition-in-ap-high-court-over-local-polls-2021
ఏపీ పంచాయతీ ఎన్నికలపై హౌస్ మోషన్ పిటిషన్
author img

By

Published : Jan 24, 2021, 7:43 PM IST

పంచాయతీ ఎన్నికలకు ఏపీ ఎస్ఈసీ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేయాలంటూ గుంటూరుకు చెందిన దూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని ఆ రాష్ట్ర హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను ఏపీ ఉన్నత న్యాయస్థానం స్వీకరించలేదు. ఈ పిటిషన్​ను సోమవారం విచారించే అవకాశం ఉంది.

2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్తే 3.60 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ఇప్పటి నోటిఫికేషన్‌ నిలిపివేసి 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిగేలా చూడాలని పిటిషన్​లో ప్రస్తావించారు.

పంచాయతీ ఎన్నికలకు ఏపీ ఎస్ఈసీ ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్‌ నిలిపివేయాలంటూ గుంటూరుకు చెందిన దూళిపాళ్ల అఖిల అనే విద్యార్థిని ఆ రాష్ట్ర హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను ఏపీ ఉన్నత న్యాయస్థానం స్వీకరించలేదు. ఈ పిటిషన్​ను సోమవారం విచారించే అవకాశం ఉంది.

2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్తే 3.60 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ఇప్పటి నోటిఫికేషన్‌ నిలిపివేసి 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిగేలా చూడాలని పిటిషన్​లో ప్రస్తావించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.