సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్ జోషి పుట్టిన రోజు కానుకగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.30 వేలు విరాళం అందజేశారు. దేశమంతా కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండి.. తన వంతు సాయంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. మే 1న తన పుట్టినరోజు సందర్భంగా శ్రీనివాస్ ముప్పై వేల ఒక్కరూపాయి చెక్కును ఎస్బీఐ బ్యాంకు మేనేజర్కు ప్రధాన మంత్రి సహాయ నిధిలో జమ చేసే నిమిత్తం అందజేసినట్టు తెలిపారు. శ్రీనివాస్ సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండల పరిషత్తు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన శ్రీనివాస్ను పలువురు అభినందించారు.
ఇవీచూడండి: మరో రెండురోజులు కేంద్ర బృందం పర్యటన