ETV Bharat / city

అధికారులకే తెలియని ప్రభుత్వ భూములు బయటకు..!

author img

By

Published : Nov 5, 2020, 10:55 AM IST

భవిష్యత్తులో భూ తగాదాలే ఉండకూడదనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం చేస్తున్న రీ-సర్వే కొత్త గొడవలకు దారి తీస్తోంది. రైతుల మధ్య కొత్త చిచ్చులు పెడుతోంది. రికార్డులో చూపినంత భూమి సర్వేలో తేలకపోవడం ఆందోళన కలిగిస్తుంటే... సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్న తీరు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములూ రీ-సర్వేలో వెలుగుచూస్తున్నాయి.

అధికారులకే తెలియని ప్రభుత్వ భూములు బయటకు..!
అధికారులకే తెలియని ప్రభుత్వ భూములు బయటకు..!

ఆంద్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన రీ-సర్వేలో కొత్త చిక్కులతో పాటు అధికారులకే తెలియని వివరాలు బయటపడుతున్నాయి. ఈ సర్వేలో అధునాతన సాంకేతికతతో సరిహద్దులను నిర్ణయిస్తున్నారు. తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో కార్‌ పద్ధతిలో సర్వే చేస్తుండగా జయంతిపురం, తిరుమలగిరి, గౌరవరం, త్రిపురవరంలో డ్రోన్‌ పద్ధతి అవలంభిస్తున్నారు.

రామచంద్రునిపేటలో ఓ రైతు సాగుచేస్తున్న భూమి దేవాదాయశాఖకు చెందిందని తేలింది. ఈ విషయం ఆ శాఖాధికారులకే ఇంతవరకూ తెలియకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదే గ్రామంలో వారసత్వంగా వచ్చిన భూపంపకాల్లో ఒకరికి 4.59 ఎకరాలుండగా మరొకరికి 4.29 ఎకరాలే ఉంది. రికార్డుల్లో మాత్రం సరిసమానంగా ఉన్నట్టు వారు చెబుతున్నారు. ఇది దాయాదుల మధ్య కొత్త గొడవకు దారితీసింది. దీని పరిష్కారం అధికారులకు పెద్ద సమస్యగానే మారింది. కొన్నిచోట్ల దస్తావేజుల్లో ఉన్నదాని కన్నా వాస్తవంలో స్థల విస్తీర్ణం తక్కువగా ఉందని అధికారులు చెబుతుంటే.... ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన రీ-సర్వే దాదాపు పూర్తి కాగా ప్రస్తుతం భూయజమానుల నుంచి వస్తున్న అభ్యంతరాలు పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జగ్గయ్యపేట మండలంలోని 18వేల మంది భూ యజమానులకు నోటీసులు అందించిన రెవెన్యూ అధికారులు... దస్తావేజులు, ధ్రువీకరణలతో రీసర్వేకు హాజరుకావాలన్నారు. 3 స్థాయిల్లో సమస్యలు పరిష్కరించనున్నట్టు చెప్పారు. రీ-సర్వే ద్వారా ఆక్రమణలు వెలుగులోకి వచ్చే అవకాశముందని.. వాటిపై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ సర్వేతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ: గ్రేటర్​ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు..

ఆంద్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన రీ-సర్వేలో కొత్త చిక్కులతో పాటు అధికారులకే తెలియని వివరాలు బయటపడుతున్నాయి. ఈ సర్వేలో అధునాతన సాంకేతికతతో సరిహద్దులను నిర్ణయిస్తున్నారు. తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో కార్‌ పద్ధతిలో సర్వే చేస్తుండగా జయంతిపురం, తిరుమలగిరి, గౌరవరం, త్రిపురవరంలో డ్రోన్‌ పద్ధతి అవలంభిస్తున్నారు.

రామచంద్రునిపేటలో ఓ రైతు సాగుచేస్తున్న భూమి దేవాదాయశాఖకు చెందిందని తేలింది. ఈ విషయం ఆ శాఖాధికారులకే ఇంతవరకూ తెలియకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదే గ్రామంలో వారసత్వంగా వచ్చిన భూపంపకాల్లో ఒకరికి 4.59 ఎకరాలుండగా మరొకరికి 4.29 ఎకరాలే ఉంది. రికార్డుల్లో మాత్రం సరిసమానంగా ఉన్నట్టు వారు చెబుతున్నారు. ఇది దాయాదుల మధ్య కొత్త గొడవకు దారితీసింది. దీని పరిష్కారం అధికారులకు పెద్ద సమస్యగానే మారింది. కొన్నిచోట్ల దస్తావేజుల్లో ఉన్నదాని కన్నా వాస్తవంలో స్థల విస్తీర్ణం తక్కువగా ఉందని అధికారులు చెబుతుంటే.... ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన రీ-సర్వే దాదాపు పూర్తి కాగా ప్రస్తుతం భూయజమానుల నుంచి వస్తున్న అభ్యంతరాలు పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జగ్గయ్యపేట మండలంలోని 18వేల మంది భూ యజమానులకు నోటీసులు అందించిన రెవెన్యూ అధికారులు... దస్తావేజులు, ధ్రువీకరణలతో రీసర్వేకు హాజరుకావాలన్నారు. 3 స్థాయిల్లో సమస్యలు పరిష్కరించనున్నట్టు చెప్పారు. రీ-సర్వే ద్వారా ఆక్రమణలు వెలుగులోకి వచ్చే అవకాశముందని.. వాటిపై తగు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ సర్వేతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండీ: గ్రేటర్​ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.