ETV Bharat / city

BONALU: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ 'బంగారు బోనం'

author img

By

Published : Jul 18, 2021, 12:25 PM IST

Updated : Jul 18, 2021, 12:58 PM IST

విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత పన్నెండేళ్ల నుంచి దుర్గమ్మకు బోనాలు సమ్పరిస్తుండటం ఆనవాయితీగా వస్తోందని భక్తులు వెల్లడించారు.

BONALU: విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం
BONALU: విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం
బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ 'బంగారు బోనం'

విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారుబోనం సమర్పించారు. హైదరాబాద్‌ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. 12 ఏళ్లుగా దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మీరాలంమండి దేవాలయ ఛైర్మన్​ గోపాల్​ ఆధ్వర్యంలో భక్తులు బోనం చెల్లించుకున్నారు. బోనంతో పాటు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బోనం సమర్పించుకుంటున్నామని భక్తులు తెలిపారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారం కార్యక్రమం నిర్వహించారు. బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని బంగారు బోనాలు తీసుకొస్తున్న వారికి ఆహ్వానం పలికారు.

ఇదీ చదవండి: Yadadri Temple: యాదాద్రిలో భక్తుల కిటకిట.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ 'బంగారు బోనం'

విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారుబోనం సమర్పించారు. హైదరాబాద్‌ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. 12 ఏళ్లుగా దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మీరాలంమండి దేవాలయ ఛైర్మన్​ గోపాల్​ ఆధ్వర్యంలో భక్తులు బోనం చెల్లించుకున్నారు. బోనంతో పాటు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని బోనం సమర్పించుకుంటున్నామని భక్తులు తెలిపారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారం కార్యక్రమం నిర్వహించారు. బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా ఘాట్ రోడ్డు నుంచి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వరకు కళాకారులతో బోనాల జాతర ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి భ్రమరాంబతో పాటు ఇతర కమిటీ సభ్యులు పాల్గొని బంగారు బోనాలు తీసుకొస్తున్న వారికి ఆహ్వానం పలికారు.

ఇదీ చదవండి: Yadadri Temple: యాదాద్రిలో భక్తుల కిటకిట.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

Last Updated : Jul 18, 2021, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.