ETV Bharat / city

Gazette for Jurisdiction of KRMB & GRMB : 'సమస్యలున్నాయ్.. గెజిట్ అమలు వాయిదా వేయాలి'

author img

By

Published : Oct 11, 2021, 12:37 PM IST

Updated : Oct 11, 2021, 2:43 PM IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్(Gazette for Jurisdiction of KRMB & GRMB) అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానుంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు పరిధిలోకి వెళ్తుంది. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలున్నాయని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. జీఆర్​ఎంబీ సమావేశానికి హాజరై రాష్ట్రానికి సంబంధించిన అభిప్రాయాలు వివరిస్తామని స్పష్టం చేశారు.

Gazette for Jurisdiction of KRMB & GRMB
Gazette for Jurisdiction of KRMB & GRMB

ఈనెల 14 నుంచి కేంద్ర జలశక్తి శాఖ గెజిట్(Gazette for Jurisdiction of KRMB & GRMB) అమల్లోకి రానుందని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్(Telangana Irrigation department Special Secretary Rajat Kumar) వెల్లడించారు. జీఆర్​ఎంబీ సమావేశానికి హాజరైన రజత్‌కుమార్ రాష్ట్రం అభిప్రాయాలు వివరిస్తామని అన్నారు. గెజిట్ అమలు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారని తెలిపారు.

గోదావరిపై ఉన్న పెద్దవాగు.. బోర్డు పరిధిలో(Gazette for Jurisdiction of KRMB & GRMB)కి వెళ్తుందని.. ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తారని రజత్‌కుమార్‌(Telangana Irrigation department Special Secretary Rajat Kumar) చెప్పారు. పెద్దవాగు పరిధిలో తెలంగాణకు 2 వేల ఎకరాల ఆయకట్టు ఉందని.. ఆంధ్రప్రదేశ్‌కు 13 వేల ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకురావడం ఇప్పట్లో కుదరదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయన్న రజత్‌కుమార్.. ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు పరిధిలోకి వెళ్తుందని స్పష్టం చేశారు.

ఈనెల 14 నుంచి గెజిట్ అమలు

"గెజిట్(Gazette for Jurisdiction of KRMB & GRMB) అమలు వాయిదా వేయాలని కోరుతున్నాం. జీఆర్​ఎంబీ భేటీలో సంబంధిత అంశాలపై చర్చిస్తాం. ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు పరిధిలోకి వెళ్తుంది. మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లడం ఇప్పట్లో కుదరదు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. గడువు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. చూద్దాం.. ఇవాళ భేటీలో ఏమవుతుందో.. కేంద్రం మనకు సానుకూలంగా ఉంటుందో లేదో చూడాలి."

- రజత్ కుమార్, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.

ఈనెల 14 నుంచి కేంద్ర జలశక్తి శాఖ గెజిట్(Gazette for Jurisdiction of KRMB & GRMB) అమల్లోకి రానుందని సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్(Telangana Irrigation department Special Secretary Rajat Kumar) వెల్లడించారు. జీఆర్​ఎంబీ సమావేశానికి హాజరైన రజత్‌కుమార్ రాష్ట్రం అభిప్రాయాలు వివరిస్తామని అన్నారు. గెజిట్ అమలు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారని తెలిపారు.

గోదావరిపై ఉన్న పెద్దవాగు.. బోర్డు పరిధిలో(Gazette for Jurisdiction of KRMB & GRMB)కి వెళ్తుందని.. ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తారని రజత్‌కుమార్‌(Telangana Irrigation department Special Secretary Rajat Kumar) చెప్పారు. పెద్దవాగు పరిధిలో తెలంగాణకు 2 వేల ఎకరాల ఆయకట్టు ఉందని.. ఆంధ్రప్రదేశ్‌కు 13 వేల ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకురావడం ఇప్పట్లో కుదరదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయన్న రజత్‌కుమార్.. ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు పరిధిలోకి వెళ్తుందని స్పష్టం చేశారు.

ఈనెల 14 నుంచి గెజిట్ అమలు

"గెజిట్(Gazette for Jurisdiction of KRMB & GRMB) అమలు వాయిదా వేయాలని కోరుతున్నాం. జీఆర్​ఎంబీ భేటీలో సంబంధిత అంశాలపై చర్చిస్తాం. ప్రస్తుతం పెద్దవాగు మాత్రమే బోర్డు పరిధిలోకి వెళ్తుంది. మిగతా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లడం ఇప్పట్లో కుదరదు. ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. గడువు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు. చూద్దాం.. ఇవాళ భేటీలో ఏమవుతుందో.. కేంద్రం మనకు సానుకూలంగా ఉంటుందో లేదో చూడాలి."

- రజత్ కుమార్, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.

Last Updated : Oct 11, 2021, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.