ETV Bharat / city

Free Drinking Water Supply Hyderabad : ఉచితంగా ఇస్తామన్నా.. ఉలుకూపలుకూ లేదు!

Free Drinking Water Supply Hyderabad : నెలకు ఉచితంగా 20వేల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తామని జలమండలి పిలుపునిచ్చి ఏడాది దాటినా సరైన స్పందన లేదు. భాగ్యనగరంలో ఇప్పటి వరకు 50 శాతం మంది మాత్రమే ఈ నీటి వినియోగానికి ముందుకొచ్చారు. ఉచితంగా నీరు పొందాలంటే.. వినియోగదారులు వారి క్యాన్​(వినియోగదారుల ఖాతా సంఖ్య)ను ఆధార్​ను అనుసంధానం చేయాలి. ఈ ప్రక్రియకు డిసెంబర్ 31న గడువు ముగియనుంది.

Free Drinking Water , హైదరాబాద్​లో ఉచిత మంచినీరు
హైదరాబాద్​లో ఉచిత మంచినీరు
author img

By

Published : Dec 20, 2021, 8:20 AM IST

Free Drinking Water Supply Hyderabad : నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తాం.. మీ క్యాన్‌(వినియోగదారుల ఖాతా సంఖ్య)ను ఆధార్‌ను అనుసంధానం చేయండని 13 నెలల కిందట గృహ వినియోగదారులకు జలమండలి పిలుపిచ్చినా గ్రేటర్‌లో ఇప్పటికి 50 శాతం మందే ముందుకొచ్చారు. ఈ నెల 31వ తేదీతో అనుసంధానం గడువు ముగియనుంది. ఆలోగా ప్రక్రియ పూర్తిచేయని వారు 13 నెలల తాగునీటి బిల్లు కింద రూ.300 కోట్లను చెల్లించాలి. వచ్చే నెల నుంచి బిల్లులను జారీ చేయనున్నారు. అత్యధికంగా సాహెబ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ జలమండలి డివిజన్లలో 60 శాతం మంది స్పందించగా, అతి తక్కువగా చార్మినార్‌ డివిజన్‌లో 21 శాతం మందే అనుసంధానం పూర్తి చేయడం గమనార్హం. బకాయి బిల్లులు భారీగా ఉండే అవకాశం ఉండడంతో చెల్లించడం కష్టమని భావించిన ఆ సంస్థ మరో అవకాశాన్ని ఇచ్చింది.

Free Drinking Water Supply Registration : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్దియా పరిధిలో అందరికీ ఉచితంగా తాగునీటిని ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. పథకం వర్తించాలంటే ప్రతి అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌ యజమాని జలమండలి వెబ్‌సైట్‌లో ఆధార్‌ సహా ఇతర వివరాలను అనుసంధానం చేయాలన్న నిబంధన పెట్టారు. 2020 డిసెంబరు నుంచి పథకం వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అనుసంధానానికి తుది గడువు 2021 డిసెంబరు నెలాఖరు వరకే ఇచ్చారు. నగరంలో మొత్తం 9.84 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉంటే ఇప్పటి వరకు 4.90 లక్షల మందినే అనుసంధానం చేశారు.

నెలాఖరులోపు మీటరు బిగిస్తే మాఫీ

20KL Free Drinking Water Supply : 13 నెలల తాగునీటి వినియోగ బిల్లు కనిష్ఠంగా రూ.6 వేల నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఉండొచ్చని జలమండలి అంచనా వేసింది. కరోనా భారం అన్ని వర్గాల ప్రజలపై పడింది. ఈ నేపథ్యంలో అంత మొత్తం ఒకేసారి చెల్లించడం ఎవరికైనా ఒకింత కష్టమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 31 లోపు సంబంధిత అపార్టుమెంట్‌/ఇంటికి నీటి మీటరు బిగించుకొని తమకు సమాచారం ఇస్తే తమ సిబ్బందే క్యాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తారని జలమండలి ఈ నెల 16వ తేదీన ప్రకటించింది. ఈ విషయమై క్షేత్రస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టింది. నెలాఖరులోగా మరో 6 శాతం మంది ముందుకు రావచ్చని భావిస్తోంది. నీటి మీటరు ఖరీదు రూ.1200 నుంచి రూ.3500 మధ్య ఉందని దాన్ని బిగించుకోవడం ద్వారా నీటి బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చని సూచిస్తోంది.

.

Free Drinking Water Supply Hyderabad : నెలకు ఉచితంగా 20 వేల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తాం.. మీ క్యాన్‌(వినియోగదారుల ఖాతా సంఖ్య)ను ఆధార్‌ను అనుసంధానం చేయండని 13 నెలల కిందట గృహ వినియోగదారులకు జలమండలి పిలుపిచ్చినా గ్రేటర్‌లో ఇప్పటికి 50 శాతం మందే ముందుకొచ్చారు. ఈ నెల 31వ తేదీతో అనుసంధానం గడువు ముగియనుంది. ఆలోగా ప్రక్రియ పూర్తిచేయని వారు 13 నెలల తాగునీటి బిల్లు కింద రూ.300 కోట్లను చెల్లించాలి. వచ్చే నెల నుంచి బిల్లులను జారీ చేయనున్నారు. అత్యధికంగా సాహెబ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ జలమండలి డివిజన్లలో 60 శాతం మంది స్పందించగా, అతి తక్కువగా చార్మినార్‌ డివిజన్‌లో 21 శాతం మందే అనుసంధానం పూర్తి చేయడం గమనార్హం. బకాయి బిల్లులు భారీగా ఉండే అవకాశం ఉండడంతో చెల్లించడం కష్టమని భావించిన ఆ సంస్థ మరో అవకాశాన్ని ఇచ్చింది.

Free Drinking Water Supply Registration : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్దియా పరిధిలో అందరికీ ఉచితంగా తాగునీటిని ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. పథకం వర్తించాలంటే ప్రతి అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌ యజమాని జలమండలి వెబ్‌సైట్‌లో ఆధార్‌ సహా ఇతర వివరాలను అనుసంధానం చేయాలన్న నిబంధన పెట్టారు. 2020 డిసెంబరు నుంచి పథకం వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అనుసంధానానికి తుది గడువు 2021 డిసెంబరు నెలాఖరు వరకే ఇచ్చారు. నగరంలో మొత్తం 9.84 లక్షల తాగునీటి కనెక్షన్లు ఉంటే ఇప్పటి వరకు 4.90 లక్షల మందినే అనుసంధానం చేశారు.

నెలాఖరులోపు మీటరు బిగిస్తే మాఫీ

20KL Free Drinking Water Supply : 13 నెలల తాగునీటి వినియోగ బిల్లు కనిష్ఠంగా రూ.6 వేల నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఉండొచ్చని జలమండలి అంచనా వేసింది. కరోనా భారం అన్ని వర్గాల ప్రజలపై పడింది. ఈ నేపథ్యంలో అంత మొత్తం ఒకేసారి చెల్లించడం ఎవరికైనా ఒకింత కష్టమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 31 లోపు సంబంధిత అపార్టుమెంట్‌/ఇంటికి నీటి మీటరు బిగించుకొని తమకు సమాచారం ఇస్తే తమ సిబ్బందే క్యాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేస్తారని జలమండలి ఈ నెల 16వ తేదీన ప్రకటించింది. ఈ విషయమై క్షేత్రస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టింది. నెలాఖరులోగా మరో 6 శాతం మంది ముందుకు రావచ్చని భావిస్తోంది. నీటి మీటరు ఖరీదు రూ.1200 నుంచి రూ.3500 మధ్య ఉందని దాన్ని బిగించుకోవడం ద్వారా నీటి బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చని సూచిస్తోంది.

.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.