ETV Bharat / city

జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద వరద బాధితుల అరెస్ట్​ - flood victims protest at ghmc office

హైదరాబాద్ పాతబస్తీ సమీపంలోని పలు ప్రాంతాల వరద బాధితులు జీహెచ్​ఎంసీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తమకు ఆర్థిక సహాయం అందడం లేదని పలువురు వాపోయారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

flood victims protest at ghmc office and some people arrested
జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద వరద బాధితుల అరెస్ట్​
author img

By

Published : Oct 31, 2020, 7:13 PM IST

ప్రభుత్వ ఆర్థిక సహాయం 10,000 రూపాయలు అందడం లేదని హైదరాబాద్ పాతబస్తీ, ఉప్పుగూడ, శివాజీ నగర్, తదితర ప్రాంతాల వరద బాధితులు జీహెచ్​ఎంసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అధికారులు తక్షణమే స్పందించి సాయం అందించాలని డిమాండ్​ చేశారు.

అధికారుల పక్షపాత ధోరణిని ఖండిస్తూ నినాదాలు చేశారు. నిజమైన బాధితులకు పరిహారం అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టించుకునే వారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వ ఆర్థిక సహాయం 10,000 రూపాయలు అందడం లేదని హైదరాబాద్ పాతబస్తీ, ఉప్పుగూడ, శివాజీ నగర్, తదితర ప్రాంతాల వరద బాధితులు జీహెచ్​ఎంసీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అధికారులు తక్షణమే స్పందించి సాయం అందించాలని డిమాండ్​ చేశారు.

అధికారుల పక్షపాత ధోరణిని ఖండిస్తూ నినాదాలు చేశారు. నిజమైన బాధితులకు పరిహారం అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టించుకునే వారు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: ఆర్థిక సహాయం కోసం వరద బాధితుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.