ETV Bharat / city

ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ.. ఈ ఆఫర్ ఎప్పటివరకంటే?

author img

By

Published : Apr 5, 2022, 6:59 AM IST

Discount on Property Tax : పన్నుదారులకు రాష్ట్ర పురపాలక శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో ఈ ఆర్థిక ఏడాదికి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి 5 శాతం పన్ను రాయితీని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 30 లోపు చెల్లించేవారికి ఎర్లీబర్డ్ ఆఫర్ వర్తిస్తుందని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు.

Discount on Property Tax
Discount on Property Tax

Discount on Property Tax : రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి 5 శాతం పన్ను రాయితీని వర్తింపజేస్తున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ప్రకటించారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ పరిధిలోని 128 పురపాలక సంఘాలు, 13 నగరపాలక సంస్థల్లో ఈ నెల 30లోపు చెల్లించేవారికి ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ (ముందస్తు చెల్లింపు రాయితీ అవకాశం) వర్తిస్తుందని తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీహెచ్‌ఎంసీలో కూడా ఆస్తి పన్నును ఈ నెల 30లోపు చెల్లించేవారికి 5 శాతం రాయితీని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.698 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఇది లక్ష్యంలో 86 శాతం. పురపాలకశాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఇది సాధ్యమైందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సారి ప్రతి ఆస్తికి క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా డిమాండ్‌ నోటీసులు ఇవ్వడంతో.. దాని సాయంతో ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లించేందుకు అవకాశం కలిగిందన్నారు.

99% ఆస్తి పన్ను వసూలుతో సిరిసిల్ల పురపాలక సంఘం మొదటి స్థానంలో నిలిచింది. 97 శాతంతో మెట్‌పల్లి, హుస్నాబాద్‌, అలంపూర్‌, కోరుట్ల తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద అంబర్‌పేట 51.8%తో అట్టడుగున నిలిచింది. నగరపాలక సంస్థల్లో కరీంనగర్‌ 95%తో మొదటి స్థానంలో ఉంది. 39 పట్టణ స్థానిక సంస్థల్లో 90% కంటే ఎక్కువ వసూలైంది. అచ్చంపేట, మందమర్రి, ఎల్లారెడ్డి పురపాలికల్లో 60% కంటే తక్కువ వసూలైంది.

Discount on Property Tax : రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించేవారికి 5 శాతం పన్ను రాయితీని వర్తింపజేస్తున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ప్రకటించారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ పరిధిలోని 128 పురపాలక సంఘాలు, 13 నగరపాలక సంస్థల్లో ఈ నెల 30లోపు చెల్లించేవారికి ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ (ముందస్తు చెల్లింపు రాయితీ అవకాశం) వర్తిస్తుందని తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీహెచ్‌ఎంసీలో కూడా ఆస్తి పన్నును ఈ నెల 30లోపు చెల్లించేవారికి 5 శాతం రాయితీని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.698 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఇది లక్ష్యంలో 86 శాతం. పురపాలకశాఖ తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఇది సాధ్యమైందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సారి ప్రతి ఆస్తికి క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా డిమాండ్‌ నోటీసులు ఇవ్వడంతో.. దాని సాయంతో ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లించేందుకు అవకాశం కలిగిందన్నారు.

99% ఆస్తి పన్ను వసూలుతో సిరిసిల్ల పురపాలక సంఘం మొదటి స్థానంలో నిలిచింది. 97 శాతంతో మెట్‌పల్లి, హుస్నాబాద్‌, అలంపూర్‌, కోరుట్ల తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద అంబర్‌పేట 51.8%తో అట్టడుగున నిలిచింది. నగరపాలక సంస్థల్లో కరీంనగర్‌ 95%తో మొదటి స్థానంలో ఉంది. 39 పట్టణ స్థానిక సంస్థల్లో 90% కంటే ఎక్కువ వసూలైంది. అచ్చంపేట, మందమర్రి, ఎల్లారెడ్డి పురపాలికల్లో 60% కంటే తక్కువ వసూలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.