ETV Bharat / city

అన్నవరంలో వివాహానికి తండ్రీకొడుకులు.. ఇద్దరికీ కరోనా

ఓ వివాహానికి హాజరైన తండ్రి, కుమారుడికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులిద్దరూ అన్నవరంలో జరిగిన పెళ్లికి వెళ్లినట్లు తెలియగా... దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు.

author img

By

Published : Jun 23, 2020, 3:34 PM IST

corona positive father and son attended wedding
కరోనా సోకిన తండ్రికొడుకులు..వివాహానికి హాజరు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో జరిగిన ఓ వివాహానికి ఆ తండ్రి కుమారులు హాజరయ్యారు. తరువాత ఆరోగ్యం సరిగ్గా లేక ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. బాధితులిద్దరినీ అధికారులు ప్రత్యేక అంబులెన్స్​లో కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. దేవస్థానం అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అప్రమత్తమయ్యారు. శ్రామిక్ రైల్లో మహారాష్ట్రకు వెళ్లి విధులు నిర్వర్తించి వచ్చిన ఓ ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​కి కరోనా సోకినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో జరిగిన ఓ వివాహానికి ఆ తండ్రి కుమారులు హాజరయ్యారు. తరువాత ఆరోగ్యం సరిగ్గా లేక ఇద్దరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరికీ కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. బాధితులిద్దరినీ అధికారులు ప్రత్యేక అంబులెన్స్​లో కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. దేవస్థానం అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అప్రమత్తమయ్యారు. శ్రామిక్ రైల్లో మహారాష్ట్రకు వెళ్లి విధులు నిర్వర్తించి వచ్చిన ఓ ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​కి కరోనా సోకినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

ఇదీ చదంవండి: 55 ఏళ్ల వ్యక్తికి కరోనా... ఆందోళనలో దివాన్​చెరువు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.