ETV Bharat / city

Rythu Bandhu: ‘రైతుబంధు’ సొమ్ము.. పాత బాకీలకేనా!

author img

By

Published : Jun 22, 2021, 7:22 AM IST

పంటల పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం రైతన్నలు ఇన్నాళ్లూ ఎదురుచూశారు. డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నామని సర్కారు చెప్పగానే ఆనందంతో బ్యాంకులకు వెళ్లారు. కానీ బ్యాంకు అధికారులు మాత్రం పంటరుణాల పేరిట రైతుబంధు డబ్బులను వారే ఉంచేసుకున్నారు. ప్రస్తుతం పెట్టుబడి కోసం డబ్బులు లేక రైతన్నలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

farmers-facing-problems-with-banks-for-taking-raithubandhu-money
‘రైతుబంధు’ సొమ్ము.. పాత బాకీలకేనా!

పంటల సాగు ప్రారంభానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందిపడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ‘రైతుబంధు’ సొమ్మును బ్యాంకులు తీసేసుకుంటున్నాయి. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించలేదని, వారి పేరిట జమ అవుతున్న డబ్బులను పాత బకాయి ఖాతాలకు మళ్లిస్తున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు రైతుబంధు సొమ్ము ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ 57.60 లక్షల మంది పొదుపు ఖాతాల్లో రూ.6,013 కోట్లను రైతుబంధు కింద జమచేసింది. బ్యాంకుకెళ్లి అడిగితే ఆ సొమ్మును వారి పాత బాకీలో వేసేశామని, ఇక పొదుపు ఖాతాలో సొమ్మేం లేదని సిబ్బంది చెబుతున్నారు.

రైతు పంటరుణం తీసుకుంటే ఏడాదిలోగా ఎప్పుడైనా చెల్లించవచ్చనే నిబంధన ఉంది. నిజానికి గతేడాది (2020) వానాకాలం సీజన్‌లో పంటల సాగుకు రూ.21 వేల కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారు. అవి కట్టడానికి ఇంకా గడువున్నా ముందుగానే రైతుబంధు సొమ్మును తీసేసుకున్నాయి. అంతకుముందు తీసుకున్న రుణాలను రైతులు చెల్లించకపోయినా వాటికింద జమ చేసుకుంటున్నాయి. 2018 డిసెంబరు నాటికి 42 లక్షల మంది రైతులు చెల్లించాల్సిన రూ.28 వేల కోట్ల పంటరుణాలను మాఫీ చేస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస హామీ ఇచ్చింది. ప్రతీ రైతుకు ఎంత బాకీ ఉన్నా రూ.లక్ష వరకూ మాఫీ చేస్తామని తెలిపింది. వీరిలో రూ.25 వేలలోపు బాకీ ఉన్నవారందరికీ గతేడాది ప్రభుత్వం బ్యాంకులకు సొమ్మును విడుదల చేసింది. రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ బాకీ ఉన్నవారి తరఫున ఇంకా రూ.27,500 కోట్లను బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంది.

రుణమాఫీ పథకం కింద ఈ ఏడాది (2021-22)లో రూ.6 వేల కోట్లను ఇస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. అవి ఇంకా విడుదల కాలేదు. ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఉద్దేశంతో 2018 నుంచి లక్షలాది మంది రైతులు పాత బాకీ కట్టి కొత్త రుణానికి రెన్యూవల్‌ చేసుకోలేదు. దీంతో బాకీ కట్టని రైతుల ఖాతాలను ఎగవేతదారుల జాబితాల్లోకి బ్యాంకులు చేర్చాయి. ఈ జాబితాలో పేరున్న రైతులకు మరో పొదుపు ఖాతా ఉంటే దానిని స్తంభింపజేసి అందులో జమయ్యే ప్రతీ పైసాను పాతబాకీ ఖాతాకు మళ్లిస్తున్నాయి. ఇందువల్లనే రైతుబంధు పేరుతో రైతులు పొదుపు ఖాతాల్లో జమ అయిన సొమ్ము పాతబాకీ ఖాతాల్లోకి వెళ్లిపోతోందని, సిబ్బంది మళ్లీ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. నిబంధనల ప్రకారమే ఇలా చేస్తున్నామని, పాతబాకీలు వసూలు చేయాలని బ్యాంకు సిబ్బందిపై ఉన్నతాధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉందని ఆయన వివరించారు.

గత 3 సీజన్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదు

'గతేడాది (2020-21)లో వానాకాలం, యాసంగి, ఇప్పుడు వానాకాలంలో వరసగా 3 సీజన్లలో రైతుబంధు సొమ్ములో ఒక్కపైసా కూడా బ్యాంకు సిబ్బంది మాకు ఇవ్వలేదు. ఇక పంటల సాగుకు పెట్టుబడులు ఎక్కడ తెచ్చుకోవాలి?'

-పుట్టపాత లచ్చమ్మ, జొన్నలపొగడ గ్రామం, నాగర్‌కర్నూలు జిల్లా

ఒక్క పైసా ఇవ్వలేదు

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రావుల గోవిందరెడ్డి. జనగామ జిల్లా వెల్దండ గ్రామంలో 4.80 ఎకరాల పొలం ఉంది. రైతుబంధు పథకం కింద ఆయన ఖాతాలో ఈ నెల 19న రూ.24,250 జమ అయింది. బ్యాంకుకెళ్లి సొమ్ము అడిగితే పాత పంటరుణ ఖాతాలో వేసేశామని చెప్పారు. ‘మా గ్రామంలో ఇలా అనేకమంది రైతుల సొమ్ము తీసేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం అమ్మాను. ఇంకా ఆ డబ్బు రాలేదు. అది వస్తే రుణం కట్టేయాలనుకున్నా. ఈలోగా రైతుబంధు సొమ్ముతో వ్యవసాయ పనులు చేయాలనుకుంటే బ్యాంకు తీసేసుకుంది. ధాన్యం డబ్బు వెంటనే ప్రభుత్వం ఇవ్వకపోతే అది మా తప్పా?’ అని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి: వరంగల్​ అర్బన్​ పేరు హన్మకొండ జిల్లాగా మార్పు

పంటల సాగు ప్రారంభానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బందిపడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ‘రైతుబంధు’ సొమ్మును బ్యాంకులు తీసేసుకుంటున్నాయి. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను తిరిగి చెల్లించలేదని, వారి పేరిట జమ అవుతున్న డబ్బులను పాత బకాయి ఖాతాలకు మళ్లిస్తున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు రైతుబంధు సొమ్ము ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ 57.60 లక్షల మంది పొదుపు ఖాతాల్లో రూ.6,013 కోట్లను రైతుబంధు కింద జమచేసింది. బ్యాంకుకెళ్లి అడిగితే ఆ సొమ్మును వారి పాత బాకీలో వేసేశామని, ఇక పొదుపు ఖాతాలో సొమ్మేం లేదని సిబ్బంది చెబుతున్నారు.

రైతు పంటరుణం తీసుకుంటే ఏడాదిలోగా ఎప్పుడైనా చెల్లించవచ్చనే నిబంధన ఉంది. నిజానికి గతేడాది (2020) వానాకాలం సీజన్‌లో పంటల సాగుకు రూ.21 వేల కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారు. అవి కట్టడానికి ఇంకా గడువున్నా ముందుగానే రైతుబంధు సొమ్మును తీసేసుకున్నాయి. అంతకుముందు తీసుకున్న రుణాలను రైతులు చెల్లించకపోయినా వాటికింద జమ చేసుకుంటున్నాయి. 2018 డిసెంబరు నాటికి 42 లక్షల మంది రైతులు చెల్లించాల్సిన రూ.28 వేల కోట్ల పంటరుణాలను మాఫీ చేస్తామని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస హామీ ఇచ్చింది. ప్రతీ రైతుకు ఎంత బాకీ ఉన్నా రూ.లక్ష వరకూ మాఫీ చేస్తామని తెలిపింది. వీరిలో రూ.25 వేలలోపు బాకీ ఉన్నవారందరికీ గతేడాది ప్రభుత్వం బ్యాంకులకు సొమ్మును విడుదల చేసింది. రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ బాకీ ఉన్నవారి తరఫున ఇంకా రూ.27,500 కోట్లను బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంది.

రుణమాఫీ పథకం కింద ఈ ఏడాది (2021-22)లో రూ.6 వేల కోట్లను ఇస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. అవి ఇంకా విడుదల కాలేదు. ప్రభుత్వం మాఫీ చేస్తుందనే ఉద్దేశంతో 2018 నుంచి లక్షలాది మంది రైతులు పాత బాకీ కట్టి కొత్త రుణానికి రెన్యూవల్‌ చేసుకోలేదు. దీంతో బాకీ కట్టని రైతుల ఖాతాలను ఎగవేతదారుల జాబితాల్లోకి బ్యాంకులు చేర్చాయి. ఈ జాబితాలో పేరున్న రైతులకు మరో పొదుపు ఖాతా ఉంటే దానిని స్తంభింపజేసి అందులో జమయ్యే ప్రతీ పైసాను పాతబాకీ ఖాతాకు మళ్లిస్తున్నాయి. ఇందువల్లనే రైతుబంధు పేరుతో రైతులు పొదుపు ఖాతాల్లో జమ అయిన సొమ్ము పాతబాకీ ఖాతాల్లోకి వెళ్లిపోతోందని, సిబ్బంది మళ్లీ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదని ఓ బ్యాంకు అధికారి చెప్పారు. నిబంధనల ప్రకారమే ఇలా చేస్తున్నామని, పాతబాకీలు వసూలు చేయాలని బ్యాంకు సిబ్బందిపై ఉన్నతాధికారుల ఒత్తిడి తీవ్రంగా ఉందని ఆయన వివరించారు.

గత 3 సీజన్లలో ఒక్కసారి కూడా ఇవ్వలేదు

'గతేడాది (2020-21)లో వానాకాలం, యాసంగి, ఇప్పుడు వానాకాలంలో వరసగా 3 సీజన్లలో రైతుబంధు సొమ్ములో ఒక్కపైసా కూడా బ్యాంకు సిబ్బంది మాకు ఇవ్వలేదు. ఇక పంటల సాగుకు పెట్టుబడులు ఎక్కడ తెచ్చుకోవాలి?'

-పుట్టపాత లచ్చమ్మ, జొన్నలపొగడ గ్రామం, నాగర్‌కర్నూలు జిల్లా

ఒక్క పైసా ఇవ్వలేదు

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రావుల గోవిందరెడ్డి. జనగామ జిల్లా వెల్దండ గ్రామంలో 4.80 ఎకరాల పొలం ఉంది. రైతుబంధు పథకం కింద ఆయన ఖాతాలో ఈ నెల 19న రూ.24,250 జమ అయింది. బ్యాంకుకెళ్లి సొమ్ము అడిగితే పాత పంటరుణ ఖాతాలో వేసేశామని చెప్పారు. ‘మా గ్రామంలో ఇలా అనేకమంది రైతుల సొమ్ము తీసేసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం అమ్మాను. ఇంకా ఆ డబ్బు రాలేదు. అది వస్తే రుణం కట్టేయాలనుకున్నా. ఈలోగా రైతుబంధు సొమ్ముతో వ్యవసాయ పనులు చేయాలనుకుంటే బ్యాంకు తీసేసుకుంది. ధాన్యం డబ్బు వెంటనే ప్రభుత్వం ఇవ్వకపోతే అది మా తప్పా?’ అని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చూడండి: వరంగల్​ అర్బన్​ పేరు హన్మకొండ జిల్లాగా మార్పు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.