ETV Bharat / city

ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి చూస్తే బాధేస్తోంది: నాగం - ఉస్మానియా ఆసుపత్రపై నాగం దిగ్భ్రాంతి

ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి చూస్తే బాధేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తక్షణమే ఆస్పత్రిలో నూతన భవనాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​కు డిమాండ్‌ చేశారు.

farmer minister nagam janardhan reddy on osmania govt hospital
ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి చూస్తే బాధేస్తోంది: నాగం
author img

By

Published : Jul 17, 2020, 11:36 AM IST

ఉస్మానియా ఆసుపత్రిలోకి చేరిన నీళ్లే... ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతి ఏడాది ఆస్పత్రి నిర్వహణకు నిధులు ఎందుకు ఖర్చు చేయడంలేదని నాగం ప్రశ్నించారు. డీఎంహెచ్‌వో ఉస్మానియా విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రోజువారీగా కరోనాపై సమీక్షలు నిర్వహించాలని కోరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చిన్న చిన్న రోగాలకు కూడా సీఎం స్థాయిలో సమీక్షలు జరిగేవని గుర్తు చేశారు.

హైదరాబాద్‌ నగరంలో నిమ్స్​ను తలదన్నే నాలుగు ఆస్పత్రులను కడతామన్న సీఎం కేసీఆర్​కు ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉస్మానియా అస్పత్రిలో కొత్త భవనాలు నిర్మించాలని నాగం డిమాండ్ చేశారు.

ఉస్మానియా ఆసుపత్రిలోకి చేరిన నీళ్లే... ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతి ఏడాది ఆస్పత్రి నిర్వహణకు నిధులు ఎందుకు ఖర్చు చేయడంలేదని నాగం ప్రశ్నించారు. డీఎంహెచ్‌వో ఉస్మానియా విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం కేసీఆర్ రోజువారీగా కరోనాపై సమీక్షలు నిర్వహించాలని కోరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చిన్న చిన్న రోగాలకు కూడా సీఎం స్థాయిలో సమీక్షలు జరిగేవని గుర్తు చేశారు.

హైదరాబాద్‌ నగరంలో నిమ్స్​ను తలదన్నే నాలుగు ఆస్పత్రులను కడతామన్న సీఎం కేసీఆర్​కు ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉస్మానియా అస్పత్రిలో కొత్త భవనాలు నిర్మించాలని నాగం డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 40 వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.