ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM

author img

By

Published : Nov 20, 2020, 2:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 3PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @3PM

1. వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఒంటి గంటా 20 నిమిషాల సుముహూర్త సమయంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్

వరద సాయంపై ఎస్‌ఈసీకి భాజపా లేఖరాసినట్టు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ముందుగా చెప్పినట్టుగానే భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే నకిలీ లేఖను సృష్టించారని, తన సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనత తెరాసదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆ సేవల వల్లే ఆర్టీసీ పుంజుకుంది!

కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఆర్టీసీ ఆదాయం సరికొత్త మార్గంలో దూసుకుపోతోంది. యువతకు ఉపాధినిచ్చేందుకు వారిలో వృత్తి నైపుణ్యాన్ని కలిగించే శిక్షణకు సై అంటోంది. కరోనా భయంతో ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించకపోవడం వల్ల డ్యూటీలు లభించట్లేదని ఆవేదన చెందిన ఉద్యోగులకు కార్గో వల్ల చేతినిండా పని కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'ఉల్లంఘనలపై చర్యలు'

జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారి విశ్వజిత్ తెలిపారు. ఈ తొలగింపు ప్రక్రియ పోలింగ్ అయ్యేంతవరకు కొనసాగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'పాన్​షాప్​లా మారిన సీబీఐ'

మహారాష్ట్రకు చెందిన మంత్రి అస్లామ్​ షేక్​ సీబీఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాజపా పాలనలో సీబీఐ ఓ పాన్​షాప్​లా తయారైందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'రూపే' సేవలను ప్రారంభించిన మోదీ

భూటాన్​లో రెండో దశ రూపే కార్డు సేవలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కరోనా విపత్తులో భూటాన్​కు భారత్ మద్దతుగా​ నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సిన్​పై భరోసా కల్పించిన ప్రధాని మోదీకి.. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆ దేశ ప్రధాని లొటాయ్​ షెరింగ్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బైడెన్​ కీలక వ్యాఖ్యలు

అమెరికా-చైనా మధ్య నడుస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. తమ ప్రభుత్వం వచ్చాక చైనాను నిబంధనల ప్రకారం నడుచుకునేలా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'రూ.62,600 కోట్లు కట్టాలి'

సహారా గ్రూప్​ వెంటనే రూ.62,600 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మార్కెట్​ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంను ఆశ్రయించింది. ఒకవేళ డబ్బు జమచేయకపోతే సహారా సంస్థల అధినేత సుబ్రతా రాయ్​ను అరెస్ట్​ చేయాలని వ్యాజ్యంలో కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. హాట్​​ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

భారత్​ - ఆస్ట్రేలియా మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​ టికెట్లన్నీ దాదాపుగా అయిపోయాయని ఆసీస్ బోర్డు చెప్పింది. నవంబరు 27న తొలి వన్డే సిడ్నీ వేదికగా జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ప్రభుదేవా రహస్య వివాహం!

స్టార్ డైరెక్టర్ ప్రభుదేవా, సెప్టెంబరులోనే ఆత్మీయుల మధ్య వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్​ వర్గాలు సమాచారం. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇంతకు ముందు రామలతను పెళ్లి చేసుకుని, 2010లో విడాకులు ఇచ్చేశారు ప్రభు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

1. వైభవంగా తుంగభద్ర పుష్కరాలు

వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఒంటి గంటా 20 నిమిషాల సుముహూర్త సమయంలో తుంగభద్ర పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కేసీఆర్ వ్యాఖ్యలపై ఫైర్

వరద సాయంపై ఎస్‌ఈసీకి భాజపా లేఖరాసినట్టు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ముందుగా చెప్పినట్టుగానే భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే నకిలీ లేఖను సృష్టించారని, తన సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనత తెరాసదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ఆ సేవల వల్లే ఆర్టీసీ పుంజుకుంది!

కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ఆర్టీసీ ఆదాయం సరికొత్త మార్గంలో దూసుకుపోతోంది. యువతకు ఉపాధినిచ్చేందుకు వారిలో వృత్తి నైపుణ్యాన్ని కలిగించే శిక్షణకు సై అంటోంది. కరోనా భయంతో ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించకపోవడం వల్ల డ్యూటీలు లభించట్లేదని ఆవేదన చెందిన ఉద్యోగులకు కార్గో వల్ల చేతినిండా పని కల్పిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'ఉల్లంఘనలపై చర్యలు'

జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారి విశ్వజిత్ తెలిపారు. ఈ తొలగింపు ప్రక్రియ పోలింగ్ అయ్యేంతవరకు కొనసాగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 'పాన్​షాప్​లా మారిన సీబీఐ'

మహారాష్ట్రకు చెందిన మంత్రి అస్లామ్​ షేక్​ సీబీఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాజపా పాలనలో సీబీఐ ఓ పాన్​షాప్​లా తయారైందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'రూపే' సేవలను ప్రారంభించిన మోదీ

భూటాన్​లో రెండో దశ రూపే కార్డు సేవలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కరోనా విపత్తులో భూటాన్​కు భారత్ మద్దతుగా​ నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సిన్​పై భరోసా కల్పించిన ప్రధాని మోదీకి.. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆ దేశ ప్రధాని లొటాయ్​ షెరింగ్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. బైడెన్​ కీలక వ్యాఖ్యలు

అమెరికా-చైనా మధ్య నడుస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. తమ ప్రభుత్వం వచ్చాక చైనాను నిబంధనల ప్రకారం నడుచుకునేలా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'రూ.62,600 కోట్లు కట్టాలి'

సహారా గ్రూప్​ వెంటనే రూ.62,600 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మార్కెట్​ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంను ఆశ్రయించింది. ఒకవేళ డబ్బు జమచేయకపోతే సహారా సంస్థల అధినేత సుబ్రతా రాయ్​ను అరెస్ట్​ చేయాలని వ్యాజ్యంలో కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. హాట్​​ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

భారత్​ - ఆస్ట్రేలియా మధ్య జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్​ టికెట్లన్నీ దాదాపుగా అయిపోయాయని ఆసీస్ బోర్డు చెప్పింది. నవంబరు 27న తొలి వన్డే సిడ్నీ వేదికగా జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ప్రభుదేవా రహస్య వివాహం!

స్టార్ డైరెక్టర్ ప్రభుదేవా, సెప్టెంబరులోనే ఆత్మీయుల మధ్య వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్​ వర్గాలు సమాచారం. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇంతకు ముందు రామలతను పెళ్లి చేసుకుని, 2010లో విడాకులు ఇచ్చేశారు ప్రభు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.