1. హైదరాబాద్లో రూ.35కే కిలో ఉల్లిగడ్డలు
హైదరాబాద్లో రూ.35కే కిలో ఉల్లిగడ్డలు ఇవ్వనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారు. నేటి నుంచి రైతుబజార్లలో విక్రయించనున్నారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దేశంలో 78లక్షలు దాటిన కేసులు
దేశంలో కొత్తగా 53వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 78లక్షలు దాటాయి. మరో 650మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా
రాష్ట్రంలో కొత్తగా 12 వందల 73 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 30 వేల 274కరోనా కేసులను గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. శ్రీవారికి వైభవంగా చక్రస్నానం
తిరుమల శ్రీవారి చక్రస్నానంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ముంబయి మాల్లో ఆరని మంటలు
ముంబయిలోని సిటీ సెంటర్ మాల్ అగ్ని ప్రమాదంలో మంటలు అదుపు చేసే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. 18 అగ్నిమాపక యంత్రాలు, 10 జంబో ట్యాంకులతో 36 గంటలుగా శ్రమిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. ఘటనా స్థలాన్ని సందర్శించారు రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. భారత్లో ఐరాస స్టాంప్
ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత విదేశాంగమంత్రి జైశంకర్.. పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో ఐరాస దశాబ్దాలుగా కృషి చేస్తోందని ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. చంద్రుడి గురించి కొత్త కబురు
జాబిల్లి గురించి కొత్త కబురును ఈనెల 26న వెల్లడిస్తామని తెలిపింది అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా. ఈ కొత్త ఆవిష్కారం.. సుదూర అంతరిక్ష యాత్రలకూ దోహదపడుతుందని వివరించింది. నాసాకు చెందిన 'సోఫియా' అబ్జర్వేటరీ దీనిని కనుగొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'కోలుకుంటారో..కూరుకుపోతారో తేల్చుకోండి'
డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ లక్ష్యంగా మరోమారు తీవ్ర విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి.. కరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకుంటారో, లేక బైడెన్ను గెలిపించి నిరాశావాదంలో కూరుకుపోతారో తేల్చుకోవాలని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. చేరాలంటే గెలవాల్సిందే
శనివారం జరిగే మ్యాచ్లో హైదరాబాద్, పంజాబ్ హోరాహోరీగా తలపడనున్నాయి. ఫ్లేఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. కాజల్ ఎంగేజ్మెంట్ !
నటి కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహమాడనున్నారు. అక్టోబర్ 30న వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి కుమార్తెగా ఏడడుగులు వేసే సమయంలో తన ప్రియనేస్తం చూపులను ఆకట్టుకునేందుకు కాజల్ సిద్ధమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.