ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉద్ధృత రూపం దాల్చుతోంది. వరుసగా పదో రోజు కూడా కార్మికులు పట్టు వీడలేదు. సమ్మెకు మద్దతుగా ఓయూ విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ నుంచి బంజారాహిల్స్లోని మినిస్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. పోలీసులు మార్గంమధ్యలోనే వారిని అడ్డుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు తమ పోరాటం ఆగదని ఓయూ విద్యార్థులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య