ETV Bharat / city

కరోనా వైరస్ నివారణకు వినూత్న ప్రచారం - బాలింగ్​ సత్తయ్య గౌడ్​ మెమోరియల్​ ఫౌండేషన్​

కరోనా వైరస్​ నివారణకు హైదరాబాద్​ హఫీజ్​పేటలో వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. బాలింగ్​ సత్తయ్య మెమోరియల్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో రోడ్డుపై చిత్రాలు గీయించి ప్రజలకు సూచనలు చేశారు. పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.

drawing on road for corona virus awareness in hafeezpet
కరోనా వైరస్ నివారణకు వినూత్న ప్రచారం
author img

By

Published : Apr 29, 2020, 2:23 PM IST

హైదరాబాద్​ హఫీజ్​పేట్​లో బాలింగ్​ సత్తయ్య మెమోరియల్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో... కరోనా పట్ల వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు పోలీసులకు సహకరించాలని మియాపూర్​ క్రాస్​రోడ్డులో చిత్రాలు గీయించారు. వైరస్ నియంత్రణకు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఛైర్మన్​ గౌతమ్​ గౌడ్​ తెలిపారు. మనం బతుకుతూ తోటివారిని బతకనివ్వాలని కోరారు. కార్యక్రమంలో మియాపూర్​ సీఐ వెంకటేశ్, ట్రాఫిక్ సీఐ నర్సింగరావు, ఎస్సై రఘురాం, ఆర్టిస్టు అసోసియేషన్ ప్రతినిధి అబ్దుల్​ బాసిత్​ పాల్గొన్నారు.

హైదరాబాద్​ హఫీజ్​పేట్​లో బాలింగ్​ సత్తయ్య మెమోరియల్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో... కరోనా పట్ల వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. కరోనా మహమ్మారిని నివారించేందుకు పోలీసులకు సహకరించాలని మియాపూర్​ క్రాస్​రోడ్డులో చిత్రాలు గీయించారు. వైరస్ నియంత్రణకు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఛైర్మన్​ గౌతమ్​ గౌడ్​ తెలిపారు. మనం బతుకుతూ తోటివారిని బతకనివ్వాలని కోరారు. కార్యక్రమంలో మియాపూర్​ సీఐ వెంకటేశ్, ట్రాఫిక్ సీఐ నర్సింగరావు, ఎస్సై రఘురాం, ఆర్టిస్టు అసోసియేషన్ ప్రతినిధి అబ్దుల్​ బాసిత్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆ విషయం గురించి కేటీఆర్​తో మాట్లాడా: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.