ETV Bharat / city

'పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు'

author img

By

Published : Dec 22, 2020, 5:38 PM IST

గౌరవప్రదమైన హోదాలో ఉన్న ఒక నేత పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Cyberabad Cp Sajjanar warning to goshamahal mla raja Singh
రాజాసింగ్ వ్యాఖ్యలపై సజ్జనార్ ఫైర్

దేశంలోనే నంబర్ వన్​ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసు వ్యవస్థ ప్రతి కేసును సమర్థంగా ఎదుర్కొంటోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇలాంటి పటిష్ఠ వ్యవస్థపై పబ్లిక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

రాజాసింగ్ వ్యాఖ్యలపై సజ్జనార్ ఫైర్

మంగళవారం ఉదయం శంషాబాద్ ఓఆర్​ఆర్​పై గోవులు తరలిస్తున్న లారీని అడ్డుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ పోలీసులపై ఆరోపణలు చేశారు. గోవధను అడ్డుకోవాల్సిన పోలీసులు.. భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు. డబ్బులు తీసుకుని గోవధకు సహకరిస్తున్నారని నిరాధార వ్యాఖ్యలు చేశారు.

రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్.. గౌరవప్రదమైన హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైమ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ పోలీసులపై అనవసరపు కమెంట్లు చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్​ అయిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.

దేశంలోనే నంబర్ వన్​ స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసు వ్యవస్థ ప్రతి కేసును సమర్థంగా ఎదుర్కొంటోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఇలాంటి పటిష్ఠ వ్యవస్థపై పబ్లిక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

రాజాసింగ్ వ్యాఖ్యలపై సజ్జనార్ ఫైర్

మంగళవారం ఉదయం శంషాబాద్ ఓఆర్​ఆర్​పై గోవులు తరలిస్తున్న లారీని అడ్డుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ పోలీసులపై ఆరోపణలు చేశారు. గోవధను అడ్డుకోవాల్సిన పోలీసులు.. భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు. డబ్బులు తీసుకుని గోవధకు సహకరిస్తున్నారని నిరాధార వ్యాఖ్యలు చేశారు.

రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్.. గౌరవప్రదమైన హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటివి పునరావృతమైతే చట్టపరమైమ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ పోలీసులపై అనవసరపు కమెంట్లు చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్​ అయిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.